News May 3, 2024

దువ్వూరు: వడదెబ్బతో వ్యక్తి మృతి

image

దువ్వూరు మండలం నేలటూరు గ్రామానికి చెందిన మైలా ఏసన్న (53) అనే వ్యక్తి గురువారం వడదెబ్బ తగిలి మృతి చెందాడు. ఏసన్న ప్రొద్దుటూరులోని ఓ ఆయిల్ మిల్లులో కూలి పనులకు వెళ్లి జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో గురువారం కూలి పనికి ప్రొద్దుటూరుకు వెళ్లాడు. మధ్యాహ్నం ఎండ తీవ్రతకు వడదెబ్బ తగిలి ఏసన్న స్పృహ తప్పడంతో తోటి కూలీలు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అతనిని డాక్టర్ పరీక్షించి మృతి చెందాడని తెలిపారు.

Similar News

News January 18, 2026

కడప: ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీనా.. ఫోన్ చేయండి.!

image

సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల యాజమాన్యాలు ఛార్జీలను విపరీతంగా పెంచాయి. దీంతో ప్రయాణికుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. దీనిపై రవాణా శాఖా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు. నిబంధనలకు లోబడి మాత్రమే ఛార్జీలను వసూలు చేయాలని ట్రావెల్స్ యజమానులకు సూచించారు. ఎవరైన అధిక ఛార్జీలు వసూలు చేస్తే 9281607001 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.

News January 18, 2026

కడప జిల్లాతో NTRకు అనుబంధం.. మీకు తెలుసా!

image

దివంగత నేత NTRకు కడపతో ప్రత్యేక అనుబంధం ఉంది. NTR 1983లో తాడిపత్రి నుంచి ఎన్నికల ప్రచారం కోసం చైతన్య రథంలో హరికృష్ణ డ్రైవర్‌గా రోడ్డు షో నిర్వహించారు. ఈ యాత్ర తాళ్ల ప్రొద్దుటూరు, పాతచౌటపల్లి, ముద్దనూరు, ఎర్రగుంట్ల, కడప మీదుగా సాగింది. పాతచౌటపల్లి చిత్రావతి నదిలో చైతన్య రథం మొరాయించడంతో అక్కడే ఆయన బస చేశారు. తిరిగి 1984లో పులివెందుల, కొండాపురం తదితర ప్రాంతాలలో ఆయన పర్యటించారు. నేడు NTR వర్ధంతి.

News January 17, 2026

కడప టు ఢిల్లీ

image

ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకలకు కడప కూచిపూడి కళాకారిణి మూలి పల్లవి ఎంపికయ్యారు. లలిత కళలకు నిలయమైన కడపకు అరుదైన గౌరవాన్ని మూలి పల్లవి తీసుకొచ్చారు. భారత సాంస్కృతిక శాఖ నుంచి ప్రత్యేక ఆహ్వానం మేరకు ఢిల్లీకి వెళ్లి భారత అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్, సంగీత నాటక అకాడమీ కేంద్రాలలో ప్రత్యేక రిహార్సల్ పొందుతున్నారు. ఏపీ నుంచి కూచిపూడి నృత్యానికి సంబంధించి 30 మందిని ఎంపికచేసింది.