News February 24, 2026
ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కు స్థలాల కేటాయింపు

సోమవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. నల్గొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, మెదక్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, హైదరాబాద్ జిల్లాల్లో 21 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ స్కూళ్ల నిర్మాణానికి భూములు కేటాయించింది.
Similar News
News February 28, 2026
HYD: సౌండ్ వద్దు.. Midnight Silence ముద్దు!

పబ్బుల హోరు.. DJల జోరు వదిలేసి హైటెక్ సిటీ Gen Z ‘నిశ్శబ్దాన్ని’ వెతుక్కుంటోంది. అర్ధరాత్రి దాటాక గచ్చిబౌలి సర్వీస్ రోడ్ల మీద కార్లు ఆపి ఎటువంటి సౌండ్ లేకుండా కేవలం ఆకాశాన్ని చూస్తూ గడపడం కొత్త ట్రెండ్. దీని పేరు కార్ పార్కింగ్ థెరపీ. ఒత్తిడిని జయించడానికి మందు అవసరం లేదు. మెట్రో రైలు శబ్దం వింటూ కారులో కునుకు తీస్తే చాలు అంటున్నారు. వినడానికి వింతగా ఉన్నా ఈ అర్బన్ సన్యాసులకు ఇదే ప్రశాంతంగా ఉందట.
News February 28, 2026
HYDలో అవినీతి ‘సిస్టమ్’ మారేనా?

GHMC పరిధిలో ACB దాడుల పరంపర కేవలం అధికారుల అవినీతిని బయటపెట్టడమే కాదు.. వ్యవస్థలో పాతుకుపోయిన ‘పర్సెంటేజీ’ల దందాను కూడా ఎండగడుతోంది. చట్టపరంగా చూస్తే 64 శాతం శిక్షా రేటు అనేది న్యాయస్థానాలు అవినీతిపై చూపిస్తున్న కఠిన వైఖరికి నిదర్శనం. రాజకీయంగా కూడా ప్రభుత్వం 115 ప్రాసిక్యూషన్ శాంక్షన్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం. అయితే, శిక్షలు ఒకవైపు.. వ్యవస్థ ప్రక్షాళన మరోవైపు సాగాల్సిందే!
News February 28, 2026
HYDలో కీలక నిర్ణయం.. ఇక ప్రతి ఆదివారం..!

గ్రేటర్ పౌరుల ప్రాపర్టీ ట్యాక్స్ సంబంధిత సమస్యలకు వేగవంతమైన పరిష్కారం కల్పించేందుకు జీహెచ్ఎంసీ చర్యలకు దిగింది. ‘ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కారం’ (PTP) కార్యక్రమాన్ని వచ్చే మార్చి నెలలో ప్రతి ఆదివారం నిర్వహించనున్నట్లు కమిషనర్ ఆర్వీ కర్ణన్ వెల్లడించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు అన్ని సర్కిల్ కార్యాలయాల్లో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. అధికారులు పన్ను సమస్యలను నేరుగా స్వీకరించి పరిష్కరిస్తారు.


