News May 3, 2024

వరంగల్: తల్లిపై కొడుకు దౌర్జన్యం

image

శాంతినగర్‌కు చెందిన భారతమ్మ(78) ఇంటిలో బుధవారం రాత్రి చోరీ జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. కుమారుడు మురళీకృష్ణ, కోడలు గాయత్రి, మనుమడు, మరో గుర్తుతెలియని వ్యక్తి వచ్చి ఆమెను గట్టిగా పట్టుకొని బలవంతంగా నోటిలో గుర్తుతెలియని ద్రవం పోయడంతో స్పృహ కోల్పోయింది. ఆ తర్వాత బీరువాలోని రూ.50 వేల నగదు, 4 తులాల బంగారు గాజులు అపహరించుకుపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

Similar News

News April 22, 2025

వరంగల్: తేలనున్న 12,321 మంది విద్యార్థుల భవితవ్యం!

image

వరంగల్ జిల్లాలో ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరాల్లో ఈ ఏడాది 12,321 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. మంగళవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా మధ్యాహ్నం 12 గంటలకు ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి. మొదటి సంవత్సరం జనరల్‌లో 4,967 మంది, ఒకేషనల్- 848, ద్వితీయ సంవత్సరం జనరల్-5,739, ఒకేషనల్‌ 767 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాలను వేగంగా Way2News యాప్‌లో చూసుకోవచ్చు. #SHARE IT

News April 22, 2025

ములుగు జిల్లాలో దారుణం.. వ్యక్తి హత్య!

image

ములుగు జిల్లా వెంకటాపురం మండలానికి చెందిన చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు చిడం సాయి ప్రకాశ్ ఈ నెల 15న హనుమకొండలో అదృశ్యమైన సంగతి తెలిసిందే. పోలీసులు విచారణ చేపట్టగా ఓ కానిస్టేబుల్ సుపారి గ్యాంగ్‌తో కలిసి సాయి ప్రకాశ్‌ను హత్య చేసినట్లు తెలిసింది. మండలంలో ఎంతోమంది గర్భిణులకు, దివ్యాంగులకు, వృద్ధులకు, ఆదివాసులకు సేవ చేసిన సాయి ప్రకాశ్ మృతితో మండలంలో విషాదం నెలకొంది.

News April 22, 2025

వరంగల్: మూడు జిల్లాల్లో విస్తరించిన ‘పాకాల’

image

పాకాల అభయారణ్యం అంటే ఒక్క వరంగల్ జిల్లానే అనుకుంటారు. నిజానికి పాకాల అడవి 839 చ.కి.మీ విస్తీర్ణంతో వరంగల్‌తో పాటు మహబూబాబాద్, ములుగు జిల్లాలోనూ విస్తరించి ఉంది. వివిధ రకాల జంతువులు, పక్షులు, సరీసృపాలకు అనువైనదిగా ఉంది. శీతాకాలంలో విదేశీ పక్షులు సైతం ఇక్కడ సందడి చేస్తాయి. నర్సంపేటకు 9 కిలో మీటర్ల దూరంలో ఉన్న పాకాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన సందర్శకులు వస్తుంటారు.

error: Content is protected !!