News February 24, 2026

నిర్మల్: పది పరీక్షలకు 9,758 మంది విద్యార్థులు

image

పదవ తరగతి పరీక్షలను మార్చి 14 నుంచి, ఏప్రిల్ 16వ తేదీ వరకు ఉదయం 9:30 నుంచి, 12:30 వరకు పరీక్షలు జరగనున్నాయని జిల్లా విద్యాధికారి దర్శనం భోజన్న తెలిపారు. జిల్లావ్యాప్తంగా 47 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 9,758 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

Similar News

News February 27, 2026

NTR: విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల షెడ్యూల్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్శిటీ(ANU) పరిధిలోని కాలేజీలలో బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చదివే విద్యార్థులు రాయాల్సిన II/lV 2వ, III/IV 2వ సెమిస్టర్ రెగ్యులర్ థియరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలు మార్చి 23 నుంచి నిర్వహిస్తామని, విద్యార్థులు ఎలాంటి ఫైన్ లేకుండా మార్చి 9లోపు, రూ.100 ఫైన్‌తో 10లోపు ఫీజు చెల్లించాలని ANU సూచించింది. వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ చూడాలని కోరింది.

News February 27, 2026

VJA: చెన్నై వెళ్లే రైలు ప్రయాణికులకు ఊరటనిచ్చే వార్త

image

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా చెన్నై సెంట్రల్(MAS), సంత్రాగచ్చి (SRC) మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు అధికారులు తెలిపారు. నెం.06077 MAS- SRC రైలును రేపు శనివారం నుంచి మార్చి 14 వరకు ప్రతి శనివారం, నెం.06078 SRC- MAS రైలును మార్చి 2 నుంచి మార్చి 16 వరకు ప్రతి సోమవారం నడుపుతామన్నారు. కాగా ఈ రైళ్లు ఏపీలో విజయవాడతో పాటు పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయన్నారు.

News February 27, 2026

గ్రేటర్ వరంగల్‌కు 100 ఎలక్ట్రిక్ బస్సులు: కలెక్టర్

image

ప్రజా రవాణాను మెరుగుపరిచేందుకు గ్రేటర్ వరంగల్ నగరానికి ప్రభుత్వం 100 ఎలక్ట్రిక్ బస్సులను మంజూరు చేసిందని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ తెలిపారు. ఆర్టీసీ, రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. బస్సుల నిర్వహణకు అవసరమైన డిపో స్థలాన్ని త్వరగా అప్పగించాలని ఆదేశించారు. పర్యావరణ హితమైన రవాణా సౌకర్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.