News February 24, 2026
ఏలూరు జిల్లాలో 98 శాతం ఇంటర్ పరీక్షలు

ఏలూరు జిల్లావ్యాప్తంగా మంగళవారం జరిగిన ద్వితీయ సంవత్సరం ఇంటర్ తెలుగు పబ్లిక్ పరీక్షకు 98 శాతం హాజరు నమోదైనట్లు ఆర్ఐవో యోహాన్ తెలిపారు. మొత్తం 16,433 మంది విద్యార్థులకు గాను 16,046 మంది హాజరయ్యారని, 387 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. హాజరైన వారిలో జనరల్ విభాగం నుంచి 14,209 మంది, ఒకేషనల్ నుంచి 1,837 మంది ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.
Similar News
News February 26, 2026
సిరిసిల్ల: అదనపు కలెక్టర్ నుంచి జిల్లా కలెక్టర్ వరకు

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్గా విధుల్లో తొలి రోజు నుంచి ఇన్ఛార్జ్ కలెక్టర్గా బాధ్యతలు నిర్వర్తించిన గరీమా అగ్రవాల్ ఇదే జిల్లాకు కలెక్టర్ కావడం విశేషం. 2025 అక్టోబర్ 23న స్థానిక సంస్థల అదనపు కలెక్టర్గా విధుల్లో చేరిన ఆమె.. అప్పటి కలెక్టర్ ఎం.హరిత సెలవుపై వెళ్లడంతో 4 నెలలుగా ఇన్ఛార్జ్ కలెక్టర్గా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం జిల్లా పూర్తిస్థాయి కలెక్టర్గా నియమితులయ్యారు.
News February 26, 2026
మన్యం: 3 రోజుల క్రితమే వచ్చి అంతలోనే మృత్యవాత.. జవాన్ వివరాలివే

జియ్యమ్మవలస(M) శిఖబడి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ దవలసింగి చంద్రమౌళి(29) గిజబ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. గ్రామస్థుల వివరాలు మేరకు మృతుడు.. గుజరాత్లో విధులు నిర్వహిస్తున్నారు. మూడు రోజుల క్రితం సెలవుపై స్వగ్రామానికి వచ్చి ఓ వివాహ వేడుకకు వెళ్లి వస్తుండగా ఈ సంఘటన జరిగిందన్నారు. మూడు సంవత్సరాల క్రితం వివాహమైందని భార్య, సంవత్సరం వయస్సున్న పాప ఉన్నారన్నారు.
News February 26, 2026
శ్రీశైలంలో అగ్నిప్రమాదాలు.. ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ ఎక్కడ?

శ్రీశైల దేవస్థానం పరిధిలోని కాటేజీలు, నిత్య అన్నదాన సత్రాల్లో ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ లేకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. గతనెల 21న, నేడు జరిగిన అగ్నిప్రమాదాలు భక్తులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఫైర్ ఎక్విప్మెంట్ ఉంటే ప్రమాద తీవ్రత తగ్గించవచ్చని భక్తులు చెబుతున్నారు. వేసవి దృష్ట్యా అధికారులు స్పందించి తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలని, సత్రాల్లో అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.


