News May 3, 2024
మేలో 20 ఏళ్ల నాటి ఉష్ణోగ్రతలు రిపీట్?

AP: రాష్ట్ర ప్రజలు అట్టుడికిపోతున్నారు. ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని స్థాయిలో ఉష్ణోగ్రతలు వణికిస్తున్నాయి. గత నెలలో టెంపరేచర్ 46 డిగ్రీల సెల్సియస్ తాకగా, ఈ నెల అంతకు మించి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 49డిగ్రీలు దాటేయొచ్చంటున్నారు. చివరిగా 2003లో రెంటచింతలలో 49.9 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఇప్పుడు అదే పరిస్థితి రిపీట్ కానుందా అన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Similar News
News March 19, 2026
సౌదీ అరామ్కో రిఫైనరీపై ఇరాన్ దాడి

ప్రపంచంలోని అతిపెద్ద చమురు ఉత్పత్తి, ఎగుమతిదారు అయిన సౌదీకి చెందిన అరామ్కో రిఫైనరీపై ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. దీంతో మంటలు చెలరేగినట్లు అధికారులు వెల్లడించారు. నష్ట తీవ్రతపై ఇప్పుడే ఓ అంచనాకు రాలేమని తెలిపారు. ‘సౌత్ పార్స్’పై అటాక్కు ప్రతీకారంగా గల్ఫ్ దేశాల్లోని ఆయిల్ రిఫైనరీలపై ఇరాన్ వరుస <<19422796>>దాడులు<<>> చేస్తోన్న విషయం తెలిసిందే. దీంతో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.
News March 19, 2026
కాసేపట్లో వర్షం..

TG: వచ్చే రెండు గంటల్లో (4.30PM వరకు) పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. ములుగు, భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని తెలిపారు. వికారాబాద్, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, యాదాద్రి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.
News March 19, 2026
‘ధురంధర్’ డైరెక్టర్ గురించి తెలుసా?

‘ధురంధర్’ డైరెక్టర్ ఆదిత్య ధర్ పేరు మారుమోగుతోంది. ఇతడు కశ్మీరీ పండిట్ కుటుంబానికి చెందినవారు. 1983లో ఢిల్లీలో జన్మించారు. క్రికెటర్ కావాలని కలలు కన్నా ఇంటర్నల్ పాలిటిక్స్ వల్ల వదిలేశారు. ముంబైకి వెళ్లి అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేశారు. 2019లో ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’ అనే సినిమాతో సంచలనం సృష్టించారు. 2021లో హీరోయిన్ యామీ గౌతమ్ను పెళ్లి చేసుకోగా 2024లో కుమారుడు జన్మించాడు.


