News February 24, 2026
సమన్వయంతో బోర్డు పరీక్షలు నిర్వహించండి: సీఎస్

పదో తరగతి, ఇంటర్ పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సీఎస్ రామకృష్ణారావు ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులకు దిశానిర్దేశం చేస్తూ.. జిల్లాలో 13,125 మంది ఇంటర్, 9,758 మంది పదో తరగతి విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు తెలిపారు.
Similar News
News February 26, 2026
కంటెంట్ క్రియేటర్లకు న్యాయమైన వాటా ఇవ్వాలి: కేంద్ర మంత్రి

సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ తమ ఆదాయంలో కంటెంట్ క్రియేటర్లకు న్యాయమైన వాటా ఇవ్వాలని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టంచేశారు. ప్రొఫెషనల్ జర్నలిస్టుల నుంచి మారుమూల ప్రాంతాల క్రియేటర్ల వరకు అందరికీ దీన్ని వర్తింపజేయాలని సూచించారు. డీప్ ఫేక్ వీడియోలు పెరిగిపోతున్నాయని, పబ్లిష్ అయ్యే ప్రతీ కంటెంట్కూ ఆయా ప్లాట్ఫామ్స్ బాధ్యత వహించాలని డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ అసోసియేషన్ కాంక్లేవ్లో అన్నారు.
News February 26, 2026
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న నూతన కలెక్టర్

యాదాద్రి జిల్లా నూతన కలెక్టర్ అనురాగ్ జయంతి గురువారం స్వామివారిని దర్శించుకున్నారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆలయానికి వచ్చిన ఆయనకు ఈవో భవాని శంకర్ ఘనస్వాగతం పలికారు. స్వయంభూవులను దర్శించుకున్న కలెక్టర్కు అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు రఘు తదితరులు పాల్గొన్నారు.
News February 26, 2026
లక్ష్యం దిశగా రుణాల పంపిణీ: కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి జిల్లాలో ప్రాధాన్యత రంగాలకు రుణాల మంజూరు ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. గురువారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా స్థాయి ఇంప్లిమెంటేషన్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఆర్థిక సంవత్సరానికి గానూ రూ. 2971.20 కోట్ల రుణాలను లక్ష్యంగా నిర్ణయించగా, డిసెంబర్ నాటికి రూ. 1937.21 కోట్లు (సుమారు 65%) పంపిణీ చేసినట్లు వెల్లడించారు.


