News February 24, 2026

ఆదిలాబాద్ AIRPORTపై కలెక్టరేట్‌లో సమీక్ష

image

ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రతిపాదిత ఎయిర్‌పోర్టు మాస్టర్ ప్లాన్‌పై సమన్వయ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ రాజర్షి షా అధ్యక్షతన జరిగిన ఈ సమావేషంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్, MP నగేశ్ పాల్గొన్నారు. భూ సేకరణకు సంబంధించిన సవాళ్లు, మాస్టర్ ప్లాన్ పరిధిలో వివిధ శాఖలు ప్రతిపాదించిన అభివృద్ధి పనులపై చర్చించారు. ప్రాజెక్టు కారణంగా ప్రభావితమయ్యే ఆస్తులు, రహదారులు భవనాలపై మాట్లాడారు.

Similar News

News March 1, 2026

కొయ్యూరు: యాక్సిడెంట్.. రెవెన్యూ ఉద్యోగికి గాయాలు

image

కొయ్యూరు మండలంలోని చింతాలమ్మ ఘాట్ రోడ్డులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రాజేంద్రపాలెం వీఆర్వో సత్యనారాయణ, ఆయన కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. సత్యనారాయణ తన కుమారుడుతో కలిసి బైక్‌పై కేడీపేట వైపు వెళ్తుండగా, ఎదురుగా వస్తున్న కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. గాయపడిన ఇద్దరిని అంబులెన్సు వాహనంలో కేడీపేట పీహెచ్‌సీకి తరలించారు.

News March 1, 2026

KMR: విద్యార్థులు మానసిక ఒత్తిడిని జయించాలి: జిల్లా మానసిక వైద్యాధికారి

image

విద్యార్థులెవ్వరూ నిరాశ చెందవద్దని, పరీక్షా కాలంలో మానసిక ఒత్తిడిని జయించాలని జిల్లా మానసిక వైద్యాధికారి డా. రమణ సూచించారు. పరీక్షల్లో ఫెయిల్ అయితే మరోసారి రాసుకోవచ్చన్నారు. జీవితం కోల్పోతే మళ్లీ తిరిగి రాదన్నారు. ఇంటర్, పదో తరగతి విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదివి ఎటువంటి నిరాశ, నిస్పృహలకు లోను కాకుండా పరీక్షలు బాగా రాయాలన్నారు. ఆత్మహత్య ప్రేరేపిత ఆలోచనలకు దూరంగా ఉండాలన్నారు.

News March 1, 2026

అనకాపల్లి జిల్లా విలేజ్ సర్వేయర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

image

ఆంధ్రప్రదేశ్ విలేజ్ సర్వేయర్స్ అసోసియేషన్ (VSAAP) అనకాపల్లి జిల్లా కార్యవర్గ ఎన్నికలు ఆదివారం జరిగాయి. అధ్యక్షుడిగా ఆర్.ఎస్.అప్పారావు, ఉపాధ్యక్షుడిగా ఐ.శ్రీను, కార్యదర్శిగా సి.హెచ్.ఉమామహేశ్, కోశాధికారిగా ఎస్.మోహన్, సంయుక్త కార్యదర్శులుగా పి.రవి ప్రసాద్, యు.జగన్నాథం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన బృందం సర్వేయర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.