News February 24, 2026
బాపట్ల: ఇంటర్ పరీక్షలకు పటిష్ట బందోబస్తు

ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షల నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా పోలీసులు పటిష్ఠ నిఘా ఏర్పాటు చేశారు. ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు డీఎస్పీలు, సీఐలు స్వయంగా పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. పరీక్షలు ప్రశాంతంగా సాగేలా కేంద్రాల సమీపంలోని జిరాక్స్ కేంద్రాలు, ఇంటర్నెట్ షాపులను తాత్కాలికంగా మూసివేయించారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తును కట్టుదిట్టం చేశారు.
Similar News
News March 2, 2026
చరిత్రలో ఈరోజు (మార్చి 2)

* 1933: బాలీవుడ్ సంగీత దర్శకుడు పద్మశ్రీ ఆనంద్జీ వీర్జీ షా జననం
* 1936: రంగస్థల నటుడు అబ్బూరి గోపాలకృష్ణ జననం
* 1962: తెలంగాణ కవి యాకూబ్ జననం
* 1938: నాటకకర్త వడ్డాది సుబ్బారాయుడు మరణం
* 1949: స్వాతంత్ర్య సమరయోధురాలు, భారత కోకిల సరోజిని నాయుడు మరణం (ఫొటోలో)
* 1990: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి మహిళా మంత్రి మసూమా బేగం మరణం
News March 2, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News March 2, 2026
NZB: వాలీబాల్ తగిలి ఇరువర్గాల మధ్య ఘర్షణ

నిజామాబాద్ రూరల్ మండలం మల్కాపూర్ తండాలో వాలీబాల్ కారణంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నట్లు రూరల్ SHO శ్రీనివాస్ తెలిపారు. ఫిబ్రవరి 27న తండాకు చెందిన కొందరు యువకులు వాలీబాల్ ఆడుతుండగా విక్రమ్ వాలీబాల్ను కొట్టగా అక్కడే ఉన్న బుజ్జి బాయి అనే వృద్ధురాలికి తగిలింది. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. ఆదివారం ఇరువర్గాల వారు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.


