News May 3, 2024
NZB: అత్తమామ వేధిస్తున్నారని.. వివాహిత ఆత్మహత్య

అత్తమామల వేధింపులు భరించలేక కోడలు ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజాంసాగర్ మండలంలోని ఆరేడులో జరిగింది. బాన్సువాడ రూరల్ సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నారాయణఖేడ్ మండలంలోని లింగాపూర్కు చెందిన స్వప్న (22)కు నిజాంసాగర్ మండలంలోని ఆరేడుకు చెందిన గడ్డం రాజుతో పెళ్లయింది. ఉపాధి నిమిత్తం రాజు హైదరాబాద్కు వచ్చాడు. అత్తమామలు రత్నవ్వ, క్రీసూస్తం తరచూ వేధిస్తున్నారు. దీంతో స్వప్న ఉరేసుకుని చనిపోయింది.
Similar News
News January 8, 2026
NZB: ఈవీఎం గోడౌన్ను తనిఖీ చేసిన కలెక్టర్

నిజామాబాద్ వినాయకనగర్లోని ఈవీఎం గోడౌన్ను కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ గురువారం సందర్శించారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయి సందర్శన జరిపారు. ఈవీఎం గోడౌన్కు వేసిన సీళ్లను పరిశీలించారు. గోడౌన్ వద్ద పోలీసు బందోబస్తు తీరును గమనించి పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట అగ్ని మాపక అధికారి శంకర్ తదితరులు పాల్గొన్నారు.
News January 8, 2026
నిజామాబాద్: బయ్యర్ – సెల్లర్ మీటింగ్లో పసుపు బోర్డు ఛైర్మన్

మైసూర్లో జరిగిన బయ్యర్-సెల్లర్ మీటింగ్లో జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. రైతుల ఆశలు, ఆశయాలకు కొత్త దిశ చూపిన హృదయస్పర్శి సమావేశంగా నిలిచిందన్నారు. తమ పంటలకు గిట్టుబాటు ధరలు, భవిష్యత్ మార్కెట్ అవకాశాలపై ఆశతో పెద్ద ఎత్తున హాజరైన రైతులు ఈ సమావేశానికి ప్రాణం పోశారని కొనియాడారు.
News January 8, 2026
NZB: 13 కిలోల గంజాయి పట్టివేత.. ఐదుగురి అరెస్ట్

నిజామాబాద్ కంఠేశ్వర్ బైపాస్ వద్ద గురువారం నిర్వహించిన తనిఖీల్లో 13 కిలోల గంజాయి పట్టుకుని, ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ES మల్లారెడ్డి తెలిపారు. ADBకి చెందిన పూజ పవర్, డి.బాయి జాదవ్ లు MP లో గంజాయి కొనుగోలు చేసి MH కు చెందిన కిషన్ మోతిరామ్ దాలే, ఇంద్రజిత్ టాగ్రే లను కలుపుకొని, చద్మల్కు చెందిన మంజ వెంకట్రాంకు గంజాయిని ఇస్తుండగా CI స్వప్న ఆధ్వర్యంలో పట్టుకున్నామని వివరించారు.


