News February 24, 2026
యువత రాజకీయాల్లోకి రావాలి: స్పీకర్

ఏపీ శాసనసభను మంగళవారం 510 మంది విద్యార్థులు సందర్శించారు. పది రోజుల విజ్ఞాన యాత్రలో భాగంగా 93 పాఠశాలల నుంచి 3,311 మంది అసెంబ్లీని వీక్షించారు. సభా విరామంలో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు విద్యార్థులతో ముచ్చటించి సందేహాలను నివృత్తి చేశారు. త్వరలో పోలవరం ప్రాజెక్టు సందర్శనకు అవకాశం కల్పిస్తామని తెలిపారు. యువత ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు.
Similar News
News March 2, 2026
అన్నపురెడ్డిపల్లి: 800 ఏళ్ల నాటి శ్రీవారి ఆలయ చరిత్ర!

అన్నపురెడ్డిపల్లిలోని శ్రీ బాలాజీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి దాదాపు 800 ఏళ్ల ఘన చరిత్ర ఉందని చరిత్రకారులు చెబుతున్నారు. ఆలయంలోని శిలాశాసనాల ప్రకారం.. క్రీ.శ. 1286లో కాకతీయుల సేనాధిపతి ‘అన్నపురెడ్డి’ తన ఇష్టదైవమైన వేంకటేశ్వర స్వామికి ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. ఆయన పేరు మీదుగానే ఈ గ్రామానికి ‘అన్నపురెడ్డిపల్లి’ అని పేరు వచ్చినట్లు పూర్వీకులు చెబుతుంటారు.
News March 2, 2026
కామినేని శ్రీనివాస్ మాస్టర్ ప్లాన్.. కొల్లేరులో కొత్త పంట!

చేపల పెంపకానికి నెలవైన కొల్లేరులో మఖానా (ఫాక్స్ నట్స్) సాగుకు ప్రతిపాదన సిద్ధమైంది. స్థానిక సహజ వనరులతో అధిక ఆదాయం పొందవచ్చని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అసెంబ్లీలో సూచించారు. కొల్లేరులో లభించే కలువ గింజల నుంచి మఖానా ఉత్పత్తి చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల రైతులకు కొత్త ఉపాధి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మఖానా సాగుతో కొల్లేరు ముఖచిత్రం మారనుందని వివరించారు.
News March 2, 2026
SRCL: జిల్లా పోలీసు కార్యాలయంలో శ్రీపాదరావుకు ఘన నివాళి

సిరిసిల్లలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిల్ల శ్రీపాదరావు జయంతిని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మహేష్ బి గితే శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. శ్రీపాదరావు సేవలను ఆయన కొనియాడారు. జిల్లా అదనపు ఎస్పీ చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.


