News May 3, 2024

పట్టభద్రుల పోలింగ్ శాతం ఈసారైనా పెరిగేనా..

image

ఓటర్లను పోలింగ్‌ కేంద్రాలకు రప్పించేలా ఈసీ చర్యలు తీసుకుంటోంది. 2015లో ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్‌ జిల్లాల పట్టభద్రుల స్థానంలో 54.62 శాతం పోలింగ్‌ నమోదైతే 2021లో 76.35శాతానికి పెరిగింది. ఈసారి పట్టభద్రుల ఓటర్లు తగ్గటంతో పోలింగ్‌ శాతం ఏ మేరకు నమోదవుతుందనే అంశంపై ఆసక్తి నెలకొంది.

Similar News

News November 11, 2025

ఖమ్మం: కౌలు రైతులు పత్తి విక్రయానికి నమోదు చేసుకోవాలి: కలెక్టర్

image

కౌలు రైతులు మద్దతు ధరకు తమ పత్తిని సీసీఐ కేంద్రాల్లో విక్రయించుకోవడానికి అవకాశం కల్పించినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సోమవారం తెలిపారు. దళారుల జోక్యం లేకుండా కౌలు రైతులు నేరుగా పత్తి విక్రయం చేయగలరని చెప్పారు. ఇందుకు సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారుల వద్ద తమ వివరాలను నమోదు చేసుకొని, అనంతరం సీసీఐ కేంద్రాల్లో పత్తిని విక్రయించాలని సూచించారు.

News November 11, 2025

ఖమ్మం: ఆయిల్ పామ్ పంట రైతులకు అధిక లాభాలు: కలెక్టర్

image

ఖమ్మం కలెక్టరేట్‌లో సహకార సంఘాల డైరెక్టర్లకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆయిల్ పామ్ లాభసాటి పంట అని అన్నారు. వరి, పత్తి, మిర్చి పంటలతో పోలిస్తే తక్కువ ఖర్చుతో అధిక లాభాలు ఇస్తుందని తెలిపారు. ఆయిల్ పామ్ సాగుకు ఎకరాకు రూ.50వేల సబ్సిడీతో పాటు ప్రభుత్వం డ్రిప్, నిర్వహణ ఖర్చులకు సహాయం అందిస్తుందని ఈ సంవత్సరం జిల్లాకు 14,500 ఎకరాల సాగు లక్ష్యం ఉన్నట్లు తెలిపారు.

News November 10, 2025

ఖమ్మం: సమస్యల పరిష్కారంపై అధికారులు చురుకుగా ఉండాలి: కలెక్టర్

image

ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి జిల్లా అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, వ్యతిరేక వార్తలపై వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. ధాన్యం, పత్తి, మొక్కజొన్న సేకరణ సజావుగా జరగాలని, పాఠశాలల భోజన నాణ్యత పర్యవేక్షించాలని ఆదేశించారు. రెండు పడకల ఇళ్ల కేటాయింపులు, ఎవ్రీ చైల్డ్ రీడ్స్ కార్యక్రమం అమలుపై కూడా కలెక్టర్ అధికారులకు సూచనలు ఇచ్చారు.