News May 3, 2024

విజయనగరంలో నారా లోకేశ్ పర్యటన ఖరారు

image

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల6న నారా లోకేశ్ విజయనగరం రానున్నారు. ఆరోజు జరిగే యువగళం కార్యక్రమంలో ఆయన పాల్గొంటారని టీడీపీ నాయకులు తెలిపారు. సాయంత్రం నాలుగు గంటలకు నగరానికి చేరుకొని సాయంత్రం ఆరు గంటల వరకు ఉంటారు. ఇక్కడ సభ అనంతరం శ్రీకాకుళం వెళ్లనున్నారు. ఇప్పటికే ఈనియోజకవర్గంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, బాలకృష్ణ ప్రచారం చేశారు.

Similar News

News March 3, 2026

మార్చి 4న కొత్తవలసలో ఒడిశా గవర్నర్ పర్యటన

image

ఒడిశా రాష్ట్ర గవర్నర్ కంభంపాటి హరిబాబు మార్చి 4వ తేదీన కొత్తవలస మండలంలో పర్యటించనున్నారు. మండలంలోని శ్రీ గురుదేవ ఛారిటబుల్ ట్రస్ట్, హాస్పిటల్‌ను ఆయన సందర్శించనున్నారు. ఈ మేరకు గవర్నర్ పర్యటనకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించాలని వివిధ శాఖల అధికారులను కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు.

News March 2, 2026

సంగాం: రేపు సంగమేశ్వర స్వామి ఆలయం మూసివేత

image

జిల్లాలోని ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం సంగాం సంగమేశ్వర స్వామి ఆలయాన్ని సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా రేపు మూసివేయనున్నట్లు ఆలయ ఈవో శ్యామలరావు తెలిపారు. మంగళవారం ఉదయం 6 గంటలకు తలుపులను మూసివేస్తామని బుధవారం సంప్రోక్షణ అనంతరం ఉదయం 8 గంటల నుంచి భక్తులను దర్శనాలకు అనుమతిస్తామని ఆలయ చైర్మన్ బోను ఆనందరావు తెలిపారు. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని ఆలయ ప్రధాన అర్చకులు సిద్ధాంతం గణపతి రావు కోరారు.

News March 2, 2026

VZM: రబీ సీజన్‌కు యూరియా కొరత లేదు

image

రబీ సీజన్ 2025-26కు జిల్లాలో యూరియా సమృద్ధిగా అందుబాటులో ఉందని జిల్లా వ్యవసాయ అధికారి వీటి రామారావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు అవసరమైన యూరియాలో ఎక్కువ భాగం సరఫరా కాగా, 5,398 మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నాయని చెప్పారు. రబీ సీజన్‌లో ఎటువంటి కొరత ఉండదని స్పష్టం చేశారు. రైతులు మట్టి పరీక్ష ఆధారంగా సమతుల ఎరువులు వినియోగించాలని సూచించారు.