News February 25, 2026

KNR: అగ్రనేతల లొంగుబాటు.. అజ్ఞాతంలో మిగిలింది ఒక్కరే!

image

పీపుల్స్‌వార్‌ నుంచి మావోయిస్టు పార్టీ వరకు దశాబ్దాల పాటు ఉద్యమ గమనాన్ని శాసించిన ఉమ్మడి KNR జిల్లా నేతలు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. తాజాగా అగ్రనేతలు తిప్పిరి తిరుపతి, మల్లా రాజిరెడ్డి లొంగుబాటుతో మావోయిస్టు కేంద్ర కమిటీ(సీసీ)లో జిల్లాకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. గతంలోనే చంద్రన్న, మల్లోజుల వేణుగోపాల్‌రావు బయటకు రాగా.. ప్రస్తుతం జగిత్యాల జిల్లాకు చెందిన గణపతి ఒక్కరే అజ్ఞాతంలో మిగిలారు.

Similar News

News February 27, 2026

‘VIROSH’ పెళ్లి ఫొటోలకు 12 గంటల్లో 2.6కోట్ల లైక్స్!

image

విజయ్ దేవరకొండ, రష్మిక వివాహం నిన్న ఉదయ్‌పూర్‌లో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత ఈ జంట ఇన్‌స్టాలో షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. విజయ్ పోస్ట్‌కు కేవలం 12 గంటల్లోనే 12 మిలియన్ల లైక్స్ రాగా రష్మిక పోస్ట్‌ 14 మిలియన్ల లైక్స్‌తో రికార్డు సృష్టించింది. ‘VIROSH’ పెళ్లి ఫొటోలు ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. ఇది వీరికున్న క్రేజ్‌ను తెలియజేస్తోంది.

News February 27, 2026

అర్హులైన ప్రతి బాధితుడికీ న్యాయం చేస్తాం: మంత్రి తుమ్మల

image

ఖమ్మం భూదాన్ భూముల్లో ఇళ్లు కోల్పోయిన అసలైన బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. బాధితులకు ఎక్కడ స్థలం ఉన్నా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని, స్థలం లేని పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. భూదాన్ స్థలాలను మోసపూరితంగా విక్రయించిన అక్రమార్కులను ఉపేక్షించేది లేదని, వారు జైలుకు వెళ్లడం ఖాయమని హెచ్చరించారు.

News February 27, 2026

చంద్రగ్రహణం: మార్చి 3న శ్రీశైల ఆలయం మూసివేత

image

పాక్షిక చంద్రగ్రహణం కారణంగా మార్చి 3న శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేయనున్నట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. ఉదయం 4:30 నుంచి 5:30 వరకు మాత్రమే అలంకార దర్శనం కల్పిస్తామన్నారు. ఉదయం 6 గంటలకు ఆలయం మూసివేస్తామని చెప్పారు. సాయంత్రం 7:30కు తిరిగి తెరిచి సంప్రోక్షణ నిర్వహించి, రాత్రి 9 నుంచి 10:30 వరకు భక్తులకు అలంకార దర్శనం కల్పిస్తామని వివరించారు.