News February 25, 2026
GNT: రాజధాని పనుల్లో గడువు టెన్షన్.. మళ్లీ కొత్త బాధ్యతలెలా?

రాజధాని గ్రామాల్లో ప్రభుత్వం రూ.1,000 కోట్లతో చేపట్టబోయే మౌలిక వసతుల పనులు రైతుల ప్లాట్లు అభివృద్ధి చేస్తున్న నిర్మాణ సంస్థలకు అప్పగిస్తున్నట్లు మంత్రి నారాయణ పలు గ్రామ సభలో చెప్పారు. అయితే రాజధాని నిర్మాణం నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని నిర్మాణ సంస్థల అవస్థలు పడుతుంటే అదనంగా మౌలిక వసతులు కల్పనకు అప్పగించడం సముచితంగా లేదని పలువురు అంటున్నారు. ఇతర వ్యక్తులకు అప్పజెప్పితే బాగుంటుందన్నారు.
Similar News
News March 3, 2026
తల్లిదండ్రులకు అలర్ట్.. ఈ నంబర్కు కాల్ చేయండి!

పరీక్షల సమయంలో విద్యార్థులు ఎదుర్కొనే మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘టెలీ మానస్’ సేవలను నిర్వహిస్తోంది. విద్యార్థులు పరీక్షల భయం, ఆందోళన లేదా ఇతర మానసిక సమస్యలతో బాధపడుతుంటే ‘14416’ అనే టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేసి ఉచితంగా నిపుణుల సలహాలు పొందవచ్చు. ఈ సేవలు 20కి పైగా భాషల్లో 24 గంటలూ అందుబాటులో ఉంటాయి. తల్లిదండ్రులు కూడా పిల్లల ప్రవర్తనలో మార్పులను గమనిస్తూ ఉండాలి. SHARE IT
News March 3, 2026
WGL: దట్టమైన అడవుల్లో జింకలు!

ఉమ్మడి వరంగల్ జిల్లాలో గతంలో అరణ్య ప్రాంతాల మార్గంలో ప్రయాణం చేస్తుంటే జింకల గుంపులు ప్రత్యక్షమై చెంగుచెంగున ఎగురుతూ వెళ్లేవి. ప్రస్తుతం ఎక్కడ చూసినా జింకలు కనిపించడం లేదు. పోడు సాగు, చెట్ల నరికివేత, గుట్టలు పిండి చేయడంతో అడవుల విస్తీర్ణం తగ్గిపోయి అవి దట్టమైన అడవుల్లోకి వెళ్లిపోయి స్థిర నివాసం ఏర్పరచుకున్నాయని వన్యప్రాణి ప్రేమికులు పరిశోధించి చెబుతున్నారు.
# నేడు ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం
News March 3, 2026
రేపు ఆన్లైన్ క్విజ్: డీఈవో నాగేశ్వరరావు

జిల్లాలో విద్యాశాఖ ఆధ్వర్యంలో సైన్స్ వారోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని డీఈఓ నాగేశ్వరరావు మంగళవారం తెలిపారు. బుధవారం ఉదయం 9:30 గంటలకు 6, 7, 8 తరగతుల విద్యార్థులకు ఆన్లైన్ క్విజ్ పోటీలు నిర్వహించనున్నారు. 22 మండలాల నుంచి ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలల జట్లు ఇందులో పాల్గొంటాయి. ప్రతిభ కనబరిచిన ఆరు టీములు ఈ నెల 6న జరిగే జిల్లా స్థాయి ఫైనల్స్కు ఎంపికవుతాయని ఆయన వెల్లడించారు.


