News February 25, 2026

ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో జాతీయ సదస్సు

image

హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ఈ నెల 25, 26న రెండు రోజుల జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు సదస్సు డైరెక్టర్ డా.బి.ప్రసాద్ తెలిపారు. ప్రారంభ సభకు ముఖ్య అతిథిగా కేయూ వీసీ ప్రొఫెసర్ ప్రతాప్ రెడ్డి హాజరు కానున్నారు. అలాగే కీలక ప్రసంగాన్ని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీకి చెందిన ఆనంద్ పవార్ ఇవ్వనున్నారు. సదస్సులో దేశ వ్యాప్తంగా అకడమిక్ నిపుణులు రానున్నారు.

Similar News

News February 27, 2026

జిల్లా ఆసుపత్రిలో పడిపోతున్న రక్త నిలువలు

image

జిల్లా కేంద్ర ఆసుపత్రిలోని బ్లడ్‌ బ్యాంకులో రక్త నిలువలు అడుగంటిపోతుండటం కలకలం రేపుతోంది. 400 యూనిట్ల సామర్థ్యం ఉన్న బ్యాంకులో ప్రస్తుతం కేవలం 66 ప్యాకెట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. రోగుల అవసరాల దృష్ట్యా ఒకరికి రక్తం ఇచ్చేందుకు ఇద్దరు దాతలను కోరుతున్నా.. కొరత తీరడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రోజుల్లో రోగులకు ప్రాణాపాయం తప్పదని వైద్య వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

News February 27, 2026

MLA శ్రీధర్ స్థానంలోకి కొత్త వ్యక్తి.?

image

రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై పార్టీ విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. అయితే నివేదిక ఇవ్వలేదు, చర్యలు తీసుకోలేదంటూ బాధితురాలు వీడియోలు విడుదల చేస్తోంది. అసెంబ్లీ సమావేశాల అనంతరం ఎమ్మెల్యేపై చర్యలు తీసుకుంటారనే ప్రచారం జోరందుకుంది. నియోజకవర్గంలో కీలకంగా ఉన్న వారికి ఇన్‌ఛార్జ్ పదవి ఇస్తారనే చర్చ నడుస్తోంది. ఇప్పటికే ఇద్దరు, ముగ్గురు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.

News February 27, 2026

ఘనంగా అరసవల్లి ఆదిత్యుని కళ్యాణం

image

అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో శుక్రవారం స్వామి వారి కళ్యాణం జరిగింది. పాల్గుణ శుద్ధ ఏకాదశి సందర్భంగా కళ్యాణం నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ తెలిపారు. ఉదయం 8 గంటలకు అనివేటి మండపంలో వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ కళ్యాణం జరిగిందని ఆలయ డీసీ ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.