News February 25, 2026
BIG BREAKING: నాగర్కర్నూల్ ఘటన.. పోస్టుమార్టం రిపోర్ట్ ప్రకటన

నాగర్కర్నూల్ మండలం కుమ్మెర మల్లన్న జాతర ఘటనలో నేరస్థులైన ముగ్గురిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. A1-ఉంద్యాల శ్రీనివాస్ రెడ్డి, A2-మధు రెడ్డి, A3-శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామన్నారు. రెండు నెలల చిన్నారి మృతదేహం పోస్టుమార్టం రిపోర్ట్లో అంతర్గతంగా, బహిర్గతంగా ఎలాంటి గాయాలు లేవని నివేదిక వచ్చిందని, RFSL రిపోర్ట్ నివేదిక వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు.
Similar News
News February 28, 2026
పెదవులు నల్లగా మారాయా?

రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవటం, ఒత్తిడి, డ్రగ్స్, స్మోకింగ్ వల్ల పెదాలు నలుపు రంగులోకి మారుతుంటాయి. హైపర్ పిగ్మెంటేషన్, మెలస్మా కూడా కొన్నిసార్లు కారణమవుతుందంటున్నారు నిపుణులు. కొబ్బరినూనె, తేనె, చక్కెర కలిపి పెదాలకు ప్యాక్ వేసి స్కబ్ చేయాలి. అలాగే పాలు, పసుపు ప్యాక్ వేయడం వల్ల కూడా పెదాల రంగు మారుతుంది. అలోవెరా జెల్, రోజ్ వాటర్, నెయ్యి, స్ట్రాబెర్రీ వంటివి పెదాలకు అప్లై చేసినా ఫలితం ఉంటుంది.
News February 28, 2026
రౌడీల్లారా.. రాష్ట్రాన్ని విడిచి పలాయనం చేయండి: సీఎం

అలర్లు, దౌర్జన్యాలు, రౌడీయిజంతో బతికేద్దామనుకున్నవారు తక్షణమే రాష్ట్రాన్ని విడిచి పారిపోవాలని సీఎం చంద్రబాబు శనివారం జరిగిన రావివలస సభలో హెచ్చరించారు. మత్తులో తప్పు చేసే గంజాయి మూకలను చిత్తు చేస్తామన్నారు. ఆడబిడ్డల జోలికొస్తే ఖబడ్దార్ అని చంద్రబాబు తీవ్ర స్వరంతో హెచ్చరించారు. చెడు దారిలో వెళుతున్న వారి పట్ల కఠినంగా వ్యవహరించి దారిలో పెడతామని స్పష్టం చేశారు.
News February 28, 2026
NPDCL చరిత్రలోనే అత్యధిక విద్యుత్ వినియోగం

ఎన్పీడీసీఎల్ చరిత్రలోనే అత్యధిక గరిష్ఠ విద్యుత్ డిమాండ్ శనివారం నమోదయిందని సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి తెలిపారు. గత ఏడాది మార్చి 11న 5816 మెగావాట్లు గరిష్ఠ డిమాండ్ నమోదు కాగా.. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే అత్యధిక గరిష్ఠ విద్యుత్ డిమాండ్ 6057 మెగావాట్లు నమోదు కావడం గమనార్హం అన్నారు. నిరంతర విద్యుత్ సరఫరా అందించడానికి ముందస్తు ప్రణాళికతో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.


