News February 25, 2026
భూపాలపల్లి: పొలాల్లోకి దూసుకెళ్లి కారు బోల్తా

భూపాలపల్లి మండలం కమలాపూర్ క్రాస్ వద్ద బుధవారం ఓ కారు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. బోర్లగూడెం గ్రామానికి చెందిన వ్యక్తి తన కారులో హనుమకొండకు వెళ్తుండగా, కమలాపూర్ శివారులోని మలుపు వద్ద ప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో కారులోని ఎయిర్ బ్యాగులు తెరుచుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. కారులోని ప్రయాణికులు, డ్రైవర్ స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు.
Similar News
News February 25, 2026
పదో పరీక్షలపై హనుమకొండ కలెక్టర్ సమీక్ష

పదో తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు, ఎంఈవోలతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. నియామక ఉత్తర్వులు తీసుకున్న అధికారులు వెంటనే తమకు కేటాయించిన పాఠశాలలను సందర్శించాలని సూచించారు. కేంద్రాల్లో విద్యార్థులకు ఎక్కడా లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
News February 25, 2026
ఖమ్మంలో ఇంటర్ తొలి రోజు పరీక్ష ప్రశాంతం

ఖమ్మం జిల్లాలో ఇంటర్ తొలి రోజు పరీక్ష ప్రశాంతంగా జరిగిందని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. మొదటి సంవత్సరం ద్వితీయ భాష పేపర్-1కు 18,258 మందిలో 17,667 మంది హాజరయ్యారు. గాంధీచౌక్ ప్రభుత్వ జూనియర్ కళాశాల కేంద్రాన్ని తనిఖీ చేసి ఏర్పాట్లు పరిశీలించారు. సీసీ కెమెరాల నిఘా, ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు కొనసాగాయని, ఎలాంటి అక్రమాలు నమోదు కాలేదని పేర్కొన్నారు.
News February 25, 2026
HYDలో ఇలా చేస్తే రూ.2లక్షల FINE!

నిర్మాణ వ్యర్థాల పారబోతపై GHMC పకడ్బందీగా వ్యవహరించనుంది. నాలాలు, చెరువుల్లో వ్యర్థాలు పారబోస్తే రూ.2 లక్షల ఫైన్ విధించే అవకాశం ఉంది. ఇందుకు ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాయి. బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలు డంప్ చేసినా ఫైన్ విధిస్తామని అధికారులు హెచ్చరించారు. బస్భవన్, VST పాత ఆఫీసు ఎదురు గల్లీలో నిర్మాణ వ్యర్థాలతో రోడ్డు మూసుకుపోవడం గమనార్హం. ఇలాంటివి రిపీట్ కావొద్దంటే కఠిన చర్యలు తీసుకోవాల్సిందే.


