News February 25, 2026

మెదక్: పరీక్షా కేంద్రాల సందర్శించిన ఎస్పీ

image

నేడు ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను ఎస్పీ డీవీ శ్రీనివాస రావు సందర్శించారు. పరీక్షల నిర్వహణ తీరును, భద్రతా ఏర్పాట్లను ఆయన సమీక్షించారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తును పటిష్టంగా ఏర్పాటు చేశామని తెలిపారు.

Similar News

News February 26, 2026

మెదక్: ఇంటర్ సెకండ్ ఇయర్‌లో 98.26% హాజరు

image

మెదక్ జిల్లాలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్షలు తొలిరోజు ప్రశాంతంగా జరిగాయి. జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన 28 కేంద్రాల్లో మొత్తం 98.26% మంది విద్యార్థులు హాజరైనట్లు జిల్లా విద్యాధికారి మాధవి తెలిపారు. జనరల్ విభాగంలో 4850 మంది, ఒకేషనల్ విభాగంలో 527 మంది పరీక్ష రాశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని, గైర్హాజరైన 95 మంది విద్యార్థుల వివరాలను వెల్లడించారు.

News February 26, 2026

మెదక్ జిల్లా పోలీస్ శాఖకు రెండు పెట్రోల్ బంకులు: ఎస్పీ

image

మెదక్ జిల్లా పోలీస్ శాఖకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(IOC) నుంచి రెండు పెట్రోల్ బంకులు మంజూరైనట్లు ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు తెలిపారు. వీటిలో ఒకటి శంకరంపేట్(ఆర్) మండల కేంద్రంలో, మరొకటి మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్ పక్కన(ఆవుసులపల్లి) ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే శంకరంపేట్(ఆర్)లో బంకు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని, త్వరలోనే మిగతావి అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు.

News February 26, 2026

మెదక్: అభివృద్ధికి కలెక్టర్ రాహుల్ రాజ్ కృషి

image

గత రెండేళ్లలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మెదక్ అభివృద్ధికి విశేష కృషి చేశారు. ఆయన హయాంలో పదవ తరగతి ఉత్తీర్ణత 93 నుంచి 97 శాతానికి పెరిగింది. 300 రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించిన ఆయన, ఆరోగ్య కేంద్రాల్లో CCTVలు ఏర్పాటు చేసి వైద్య సేవలను మెరుగుపరిచారు. రోడ్డు ప్రమాద మరణాలను తగ్గించడంతో పాటు, వేలాది భూ సమస్యలను పరిష్కరించి పాలనలో వేగం పెంచారు.