News May 3, 2024

ఆసుపత్రి బెడ్‌పై ఉన్న ఫొటో షేర్.. విమర్శలు

image

దివంగత సుశాంత్‌సింగ్ మాజీ ప్రేయసి అంకితా లోఖండే, ఆమె ప్రియుడు విక్కీ జైన్‌పై ట్రోల్స్ వస్తున్నాయి. ఆమె ఆసుపత్రి బెడ్‌పై ఉన్న ఫొటోలు ఇన్‌స్టాలో షేర్ చేశారు. అంకిత చేతికి కట్టు ఉండటం అందులో కనిపించింది. కాగా.. ‘ఇంత షో ఆఫ్ అవసరమా’ అని ఒక నెటిజన్ ప్రశ్నిస్తే.. ‘అటెన్షన్ కోసం’ అని మరొకరు కామెంట్ చేశారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన వారు రెస్ట్ తీసుకోకుండా ఇవి అవసరమా అని ట్రోల్స్ చేస్తున్నారు.

Similar News

News July 6, 2025

రోజుకు 9 గంటల నిద్ర.. రూ.9 లక్షలు గెలిచింది

image

ఎక్కువ సమయం నిద్రపోతే బద్దకం వస్తుందని ఇంట్లో వాళ్లు తిడుతుంటారు. కానీ పుణేకు చెందిన పూజా రోజుకు 9 గంటలు నిద్రిస్తూ రూ.9.1 లక్షలు గెలిచారు. ఓ పరుపుల కంపెనీ నిర్వహించిన పోటీలో పాల్గొని, 60 రోజులు సగటున 9 గంటల పాటు ఎలాంటి ఆటంకం లేకుండా నిద్రించారు. నిద్రలేమిపై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన ఇంటర్న్‌షిప్‌లో లక్ష మందిలో 15 మంది తుదిపోరులో నిలిచారు. వీరిలో బెస్ట్ స్కోర్‌తో పూజా నగదు గెలిచారు.

News July 6, 2025

రాష్ట్రంలో ఊపందుకున్న బర్లీ పొగాకు కొనుగోళ్లు

image

AP: రాష్ట్రవ్యాప్తంగా HD బర్లీ పొగాకు కొనుగోళ్లు జరుగుతున్నాయని మార్క్‌ఫెడ్ ఎండీ ఢిల్లీరావు తెలిపారు. ఇంకొల్లు, పంగులూరు, పర్చూరు, బీకేపాలెం, చీరాల, గుంటూరు, పెదకాకాని, చిలకలూరిపేట, ఎడ్లపాడు, గుండ్లపల్లి కేంద్రాల్లో కొనుగోళ్లు జరుగుతున్నాయని చెప్పారు. రూ17.20 కోట్ల విలువైన 2245 బేళ్ల పొగాకు విక్రయాలు జరిగినట్లు వెల్లడించారు. రైతులకు డిజిటల్ చెల్లింపులు చేస్తున్నట్లు ఆయన వివరించారు.

News July 6, 2025

వర్షంలో తడుస్తున్నారా?

image

కొందరు వర్షంలో తడుసుకుంటూ ఇంటికి వచ్చి యథావిధిగా పనులు చేసుకుంటుంటారు. కానీ ఇలా చేయడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తడిసిన వెంటనే దుస్తులు మార్చుకుంటే శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థితికి చేరుకుంటుంది. దీనివల్ల ఫంగస్ ఇన్ఫెక్షన్ కారకాల నుంచి తప్పించుకోవచ్చు. శరీరంపై యాంటీ బాక్టీరియల్ క్రీమ్ రాసుకోవాలి. టీ లేదా కషాయాలు తాగాలి. ఇలా చేస్తే రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.