News May 3, 2024

అమేథీలో 26ఏళ్ల తర్వాత తొలిసారిగా – 1/2

image

అమేథీ ఎంపీ సీటు అభ్యర్థిగా కిశోరీ లాల్ శర్మను కాంగ్రెస్ ప్రకటించడం చర్చనీయాంశమైంది. 26ఏళ్ల తర్వాత మళ్లీ గాంధీయేతర వ్యక్తి బరిలో నిలిచారు. చివరగా 1998లో సతీశ్ శర్మ ఇక్కడ పోటీ చేశారు. 1980లో తొలిసారిగా సంజయ్ గాంధీ పోటీ చేసి గెలిచారు. హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన చనిపోవడంతో 1981 బైపోల్స్‌లో సోదరుడు రాజీవ్ గాంధీ పోటీ చేసి గెలిచారు. 1991లో రాజీవ్ మరణం తర్వాత ఆ సీటు సతీశ్ శర్మకు వెళ్లింది. <<-se>>#Elections2024<<>>

Similar News

News December 31, 2025

VHT: 14 సిక్సర్లతో సర్ఫరాజ్ విధ్వంసం

image

విజయ్ హజారే ట్రోఫీలో గోవాతో జరుగుతున్న మ్యాచులో ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ విధ్వంసం సృష్టించారు. 75 బంతుల్లో 9 ఫోర్లు, 14 సిక్సర్లతో 157 రన్స్ చేశారు. దీంతో 50 ఓవర్లలో ముంబై 444/8 స్కోరు చేసింది. ఉత్తరాఖండ్‌తో మ్యాచులో మహారాష్ట్ర కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 124 రన్స్ చేశారు. అటు పుదుచ్చేరితో మ్యాచులో కర్ణాటక ఓపెనర్లు మయాంక్ అగర్వాల్(132), దేవదత్ పడిక్కల్(113) శతకాల మోత మోగించారు.

News December 31, 2025

సూర్య, నేను మంచి స్నేహితులమే: ఖుషీ

image

టీమ్ ఇండియా T20 కెప్టెన్ సూర్య కుమార్ తనకు తరచూ <<18713013>>మెసేజ్<<>> చేసేవాడన్న వ్యాఖ్యలపై నటి ఖుషీ ముఖర్జీ క్లారిటీ ఇచ్చారు. తాము మంచి స్నేహితులమని తెలిపారు. అంతకుమించి చెప్పడానికీ తమ మధ్య ఏమీ లేదన్నారు. కాగా ఆ సమయంలో సూర్య మ్యాచ్ ఓడిపోవడంతో తాను బాధపడినట్లు పేర్కొన్నారు. దీంతో అప్పుడే క్లారిటీగా చెప్పాల్సిందని ఖుషీపై సూర్య ఫ్యాన్స్ ఫైరవుతున్నారు.

News December 31, 2025

2025: రెండు రోజులకో అవినీతి కేసు

image

TG: ఈ ఏడాది సగటున రెండు రోజులకు ఒక అవినీతి కేసు నమోదైనట్లు ACB తెలిపింది. మొత్తంగా 199 కేసులు రిజిస్టర్ అయ్యాయని వెల్లడించింది. ట్రాప్ కేసుల్లో 176 ప్రభుత్వ ఉద్యోగులు అరెస్టయ్యారని, మొత్తంగా 273 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొంది. సోదాల్లో రూ.96.13 కోట్ల విలువైన అక్రమ ఆస్తులను, రూ.57.17 లక్షల నగదును గుర్తించామంది.
* అవినీతిపై ఫిర్యాదుకు టోల్ ఫ్రీ నంబర్ 1064, వాట్సాప్ 9440446106