News February 25, 2026
రేపు వెలుగుమట్ల బాధితులను పరామర్శించనున్న KTR

BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపు(గురువారం) ఉదయం 11 గంటలకు ఖమ్మం నగరంలోని వెలుగుమట్ల బాధితులను పరామర్శించనున్నట్లు జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉదయం ఖమ్మం జిల్లా కార్యాలయం తెలంగాణ భవన్కు చేరుకోవాలని పిలుపునిచ్చారు. పూర్తి కార్యక్రమ వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు.
Similar News
News February 27, 2026
ఎప్స్టీన్ ప్రకంపనలు.. దిగ్గజాల రాజీనామా

ఎప్స్టీన్తో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో ప్రపంచవ్యాప్తంగా దిగ్గజాలు పదవులకు రాజీనామా చేస్తున్నారు. WEF CEO బోర్జ్ బ్రెండే, హార్వర్డ్ మాజీ ప్రెసిడెంట్ లారెన్స్ సమ్మర్స్, నోబెల్ గ్రహీత రిచర్డ్ ఆక్సెల్ తమ పదవుల నుంచి వైదొలిగారు. గోల్డ్మన్ శాక్స్ లీగల్ ఆఫీసర్ క్యాథీ రూమ్లెర్, హయత్ హోటల్స్ వారసుడు థామస్ ప్రిట్జ్కర్, DP వరల్డ్ ఛైర్మన్ సుల్తాన్ అహ్మద్, నార్వే అంబాసిడర్ మోనా కూడా ఈ లిస్టులో ఉన్నారు.
News February 27, 2026
విజయవాడ: లాడ్జిలలో వ్యభిచారం

విజయవాడలోని గవర్నర్ పేటలో లాడ్జిపై పోలీసులు దాడి చేశారు. ఓ లాడ్జీలో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న స్థానికుల సమాచారం మేరకు గురువారం సాయంత్రం దాడి చేశారు. ఇద్దరు విఠులను అరెస్ట్ చేసి నలుగురు మహిళలను వ్యభిచార కూపం నుంచి విడిపించినట్లు సీఐ నాగమురళి తెలిపారు. కోర్టు ఉత్తర్వులు ప్రకారం మహిళలను సంరక్ష కేంద్రానికి పంపించామన్నారు.
News February 27, 2026
సూసైడ్ గురించి సెర్చ్ చేస్తే పేరెంట్స్కు అలర్ట్

పిల్లలు సూసైడ్ లేదా సెల్ఫ్-హార్మ్ వంటి పదాలతో ఇన్స్టాలో సెర్చ్ చేస్తే.. వెంటనే పేరెంట్స్కు అలర్ట్ వెళ్లేలా కొత్త ఫీచర్ వచ్చింది. పేరెంట్స్ సూపర్విజన్ టూల్స్ వాడుతున్న వారికి ఈ నోటిఫికేషన్లు వాట్సాప్ లేదా SMS రూపంలో వెళ్తాయి. ప్రస్తుతం US, UK వంటి దేశాల్లో మొదలైన ఈ ఫీచర్ 2026 చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది. పిల్లలను కౌన్సెల్ చేసేలా నిపుణుల సలహాలనూ ఇన్స్టా అందిస్తుంది.


