News February 25, 2026
తిరుమలలో శ్రీవారి ధర్మ రథాలకు విశేష ఆదరణ

తిరుమలలో టీటీడీ నిర్వహిస్తున్న ఉచిత ఎలక్ట్రిక్ బస్సులకు డిజిటల్ డిస్ప్లే బోర్డుల ఏర్పాటుతో మరింత ఆదరణ లభిస్తోంది. 12 బస్సులు రోజుకు 300 ట్రిప్పులు నిర్వహిస్తూ సుమారు 60 వేల మంది భక్తులను రవాణా చేస్తున్నాయి. డిజిటల్ బోర్డులను B.S. Technotronics Private Limited విరాళంగా అందించగా, సాంకేతిక సహకారం Olectra Greentech Limited అందిస్తోంది. రాత్రివేళల్లో అదనంగా 20 ట్రిప్పులు పెంచనున్నారు.
Similar News
News February 27, 2026
సీఎంఆర్ ధాన్యం గోల్మాల్.. మిల్లర్లపై ఆర్ఆర్ యాక్ట్!

జిల్లాలో సీఎంఆర్ ధాన్యం పక్కదారి పట్టిన వ్యవహారంలో యంత్రాంగం కొరడా ఝుళిపించింది. సుమారు 5,89,533 క్వింటాళ్ల ధాన్యాన్ని మాయం చేసిన నలుగురు మిల్లర్లపై కేసులు నమోదు చేశారు. బకాయిల రికవరీకి ‘ఆర్ఆర్ యాక్ట్’ అమలు చేయాలని అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ తహశీల్దార్లను ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై భారతీయ న్యాయ సంహిత, నిత్యావసర వస్తువుల చట్టం కింద చర్యలు చేపట్టారు.
News February 27, 2026
ప్రొద్దుటూరులో బంతి బంతికి పందెం.?

T20 వరల్డ్ కప్ క్రికెట్ పోటీలు క్రికెట్ ప్రియులకు సందడిగా మారాయి. ఈ సీజన్లో ప్రొద్దుటూరులో ఎక్కడ చూసినా క్రికెట్ బెట్టింగ్ మాఫియాలు బంతి బంతికి పందెం నిర్వహిస్తున్నారు. యువత క్రికెట్ బెట్టింగ్ జూదానికి బానిస అయ్యారు. ప్రత్యేక బెట్టింగ్ యాప్లతో ఆన్లైన్లో బెట్టింగ్ నిర్వహిస్తున్నారనే సమాచారం వినిపిస్తోంది. ప్రొద్దుటూరు క్రికెట్ మాఫియాతో రాజకీయ నాయకులకు, పోలీసులకు లింక్ ఉందనే ఆరోపణలున్నాయి.
News February 27, 2026
ఏపీ హైకోర్టు నూతన సీజేగా జస్టిస్ లీసా గిల్

AP హైకోర్టు నూతన CJగా జస్టిస్ లీసా గిల్ను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ప్రస్తుత CJ జస్టిస్ ధీరజ్సింగ్ మరో 2 నెలల్లో రిటైర్ కానున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. జస్టిస్ లీసా పంజాబ్&హరియాణా హైకోర్టులో న్యాయమూర్తిగా విధులు నిర్వర్తిస్తున్నారు. B.A. LL.B, LL.M పూర్తి చేసిన ఈమె 1990లో లాయర్గా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. 2014లో పంజాబ్&హరియాణా జడ్జిగా నియమితులయ్యారు.


