News February 25, 2026

ఫేక్ TTD వెబ్‌సైట్లపై పోలీసులకు ఫిర్యాదు

image

తిరుమలలో వసతి గదులు కల్పిస్తామంటూ నకిలీ వెబ్‌సైట్ల ద్వారా భక్తులను మోసం చేస్తున్న ఘటనలపై TTD అప్రమత్తమైంది. విజిలెన్స్ విచారణలో TTD పేరు, ఆలయ చిత్రాలను అనధికారికంగా ఉపయోగించి ఫేక్ వెబ్‌సైట్లు రూపొందించి ఆన్‌లైన్‌లో డబ్బులు వసూలు చేస్తున్నట్లు తేలింది. దీంతో సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు కాపీరైట్ చట్టం కింద కేసులు నమోదు చేశారు.

Similar News

News February 28, 2026

చీపురుపల్లి: నువ్వు ఏమవుతావు? అని అడిగిన CM

image

సీఎం చంద్రబాబు శనివారం చీపురుపల్లిలో పర్యటించారు. చీపురుపల్లి CHCని పరిశీలించారు. అక్కడ ఉన్న విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. ‘నువ్వు ఎం కావాలి అనుకుంటున్నావు’ అని ఓ విద్యార్థిని సీఎం అడగగా డాక్టర్ కావాలని అనుకుంటున్నానని చెప్పింది. అనంతరం విద్యార్థికి సీఎం ఆటోగ్రఫ్ ఇచ్చారు.

News February 28, 2026

ఖమ్మం: రూ.541 కోట్ల సైబర్ మోసంలో నిందితుడి అరెస్టు?

image

సత్తుపల్లి కేంద్రంగా వెలుగులోకి వచ్చిన రూ.541 కోట్ల భారీ సైబర్‌ క్రైమ్‌ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఎర్రుపాలెం మండలానికి చెందిన ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. దీనిపై పోలీసులు ఇంకా అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కుంభకోణంలో నిందితుల మూలాలు వెలికితీసేందుకు అధికారులు విచారణను వేగవంతం చేశారు.

News February 28, 2026

కల్వకుర్తి: రాజ్యసభ రేసులో వంశీచంద్ రెడ్డి..?

image

ఏఐసీసీ కార్యదర్శి, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డి రాజ్యసభ సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. జాతీయ స్థాయిలో పార్టీకి అందిస్తున్న సేవలను గుర్తించి ఆయనకు అవకాశం ఇవ్వాలని పలువురు నేతలు సీఎం రేవంత్ రెడ్డిపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. త్వరలో రాష్ట్రం నుంచి రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ చర్చ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.