News February 25, 2026
పార్వతీపురం: ‘గర్భిణీల్లో ప్రమాదకర లక్షణాలను సకాలంలో గుర్తించాలి’

గర్భిణీల్లో ప్రమాదకర లక్షణాలను ముందస్తుగా గుర్తించి సకాలంలో చికిత్స, పర్యవేక్షణ చేయాలని DMHO డాక్టర్ ఎస్.భాస్కరరావు స్పష్టం చేశారు. హైరిస్క్ గర్భిణీల ఆరోగ్య నిర్వహణ, నియమాలపై వైద్యాధికారులకు ఓరియంటేషన్ శిక్షణను పార్వతీపురంలోని ఎన్జీవో హోమ్లో బుధవారం నిర్వహించారు. గర్భిణీల్లో ప్రధాన హైరిస్క్ సమస్యలైన అక్లాంప్సియా, యుక్త వయసులో గర్భం దాల్చడం, దీర్ఘంగా ఉండే జ్వర లక్షణాలు సకాలంలో గుర్తించాలన్నారు.
Similar News
News March 1, 2026
హైదరాబాద్లో టీచింగ్ పోస్టులు

<
News March 1, 2026
ఆరోగ్యం కోసం ఏం మానేయాలంటే?

బాలార్కో ప్రేతధూమశ్చ వృద్ధా స్త్రీ పల్వలోదకమ్|
రాత్రౌ దధ్యన్నభుక్తిశ్చ ఆయుఃక్షీణం దినే దినే||
సూర్యోదయ సమయంలో వచ్చే ఎండ, శ్మశానంలోని దహన పొగ, వయసు మళ్లిన స్త్రీతో పొందు, నిల్వ ఉన్న మురికి గుంటలోని నీరు తాగడం, రాత్రి పెరుగన్నం తినడం మంచిది కాదు. దీనివల్ల ఆయుష్షు రోజురోజుకూ క్షీణిస్తుంది. రాత్రిపూట పెరుగుకు బదులుగా పాలు తీసుకోవచ్చు. పాలన్నం కూడా ఆరోగ్యకరమే. ఈ నియమాలను పాటిస్తే సంపూర్ణ ఆరోగ్యం.
News March 1, 2026
హోలీ.. సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు

హోలీ పండుగ నేపథ్యంలో ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లుగా సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు పేర్కొన్నారు. ఇందులో భాగంగానే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ నుంచి నహరిగన్ సహా ఇతర ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు చెప్పారు. Rail One యాప్ ద్వారా వీటికి సంబంధించిన వివరాలను చూసుకునే వెసులుబాటును కల్పించినట్లుగా తెలిపారు.


