News February 25, 2026

సంగారెడ్డి: ‘ఏటీసీ సెంటర్లతో ఉజ్వల భవిష్యత్తు’

image

ఆధునిక సాంకేతికతతో ప్రభుత్వం అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లను(ATC) ఏర్పాటు చేసిందని డైరెక్టర్ కాంతి వెస్లీ తెలిపారు. బుధవారం సంగారెడ్డి ప్రభుత్వ ఐటీఐలో కలెక్టర్ ప్రావీణ్యతో కలిసి ‘ఆన్-ది-జాబ్ ట్రైనింగ్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక్కడ శిక్షణ పొందే విద్యార్థులు కేవలం ఉద్యోగులుగానే కాకుండా, భవిష్యత్తులో గొప్ప పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆమె ఆకాంక్షించారు.

Similar News

News February 27, 2026

పాడి పశువులను కొనే ముందు జాగ్రత్తలు

image

పాడి పశువును కొనే సమయానికి అది 2వ ఈతలో ఉండాలి. ఏ సమస్యా లేకుండా ఈనిన ఆరోగ్యమైన పశువును 15 రోజుల లోపు కొనుగోలు చేయాలి. ధరను పాల ఉత్పత్తిని బట్టి నిర్ణయించాలి. పశువును కొనేముందు మొదటిసారి తీసిన పాలను లెక్కలోకి తీసుకోకూడదు. రెండో రోజు ఉదయం, సాయంత్రం తీసిన పాలను లెక్కలోకి తీసుకోవాలి. లీటరు డబ్బాలతో పాలను కొలవాల్సి వస్తే పాలపై నురగని పూర్తిగా తీసివేయాలి. అన్ని పశువులను ఒకేసారి కొనకపోవడం మంచిది.

News February 27, 2026

ఆరుట్ల మోడల్.. 100 తెలంగాణ పబ్లిక్ స్కూల్స్!

image

TG: రంగారెడ్డి(D) ఆరుట్ల స్కూల్ తరహాలో 100 నియోజకవర్గాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్(TPS) ప్రారంభించాలని CM రేవంత్ అధికారులను ఆదేశించారు. క్లాస్ రూములు, గ్రౌండ్, ట్రాన్స్‌పోర్ట్, టీచింగ్ స్టాఫ్ వంటి సకల వసతులు ఉండేలా చూడాలన్నారు. ఇక HYDలో 12 ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ఏడాదిలోగా పూర్తి చేయాలని సూచించారు. నాణ్యమైన విద్య కోసం ఎంత ఖర్చుకైనా వెనకాడబోమని స్పష్టం చేశారు.

News February 27, 2026

గంగా జలం ఇంటికి తెచ్చుకుంటున్నారా?

image

గంగా జలం ఇంట్లో ఉంటే చాలా మంచిది. అయితే పుణ్య క్షేత్రాల నుంచి ఆ జలాన్ని తెచ్చేటప్పుడు చాలామంది ప్లాస్టిక్ బాటిళ్లు వాడుతుంటారు. దాని బదులు ఇత్తడి పాత్రలు వాడితే ఆ జలంలోని ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుందని పండితులు చెబుతున్నారు. ‘గంగా జలం వాస్తు దోషాలను, ప్రతికూల శక్తులను పోగొడుతుంది. గ్రహణాల తర్వాత, శుభకార్యాలప్పుడు ఇంటిని శుద్ధి చేయడానికి దీనిని ప్రోక్షించడం వల్ల సానుకూలత పెరుగుతుంది’ అంటున్నారు.