News February 26, 2026
ఏప్రిల్ నుంచి కొత్త పెట్రోల్ రూల్

దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి 20% ఇథనాల్ కలిపిన పెట్రోల్ (E20) సేల్స్ను కేంద్రం తప్పనిసరి చేసింది. ఇంజిన్ పనితీరు దెబ్బతినకుండా ఉండేందుకు కనీసం 95 రీసెర్చ్ ఆక్టేన్ నంబర్ (RON) ఉండాలని ఆయిల్ కంపెనీలను ఆదేశించింది. దీనివల్ల కాలుష్యం 30% వరకు తగ్గడమే కాకుండా రైతులకు మేలు జరుగుతుంది. అయితే పాత వాహనాల్లో మైలేజీ 3-7% తగ్గే అవకాశం ఉంది. 2023 తర్వాత తయారైన వాహనాలకు ఈ ఇంధనం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు.
Similar News
News February 28, 2026
INDvsWI.. పిచ్ రిపోర్ట్ ఇదే

T20WC S-8లో రేపు కోల్కతాలో 7PMకి IND, WI తలపడనున్నాయి. ఇందులో గెలిచిన జట్టే సెమీస్ చేరనున్న నేపథ్యంలో మ్యాచుపై ఉత్కంఠ నెలకొంది. ఈ మ్యాచ్ కోసం ఈడెన్ గార్డెన్స్ పిచ్ను బాలెన్స్డ్గా తయారు చేసినట్లు క్యురేటర్ తెలిపారు. ‘ఈ పిచ్పై 200+ స్కోర్ నమోదవుతుంది. 200+ ఛేజ్ చేయవచ్చు. ఏ జట్టు అయితే తమ స్కిల్స్ను బాగా ఉపయోగిస్తుందో అదే గెలుస్తుంది. డ్యూ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం’ అని వివరించారు.
News February 28, 2026
గల్ఫ్ దేశాలకు మద్దతు ప్రకటించిన పాక్

ఇరాన్, గల్ఫ్ దేశాలపై జరుగుతున్న దాడులను పాకిస్థాన్ పీఎం షెహబాజ్ షరీఫ్ ఖండించారు. యూఏఈతో పాటు ఇతర గల్ఫ్ దేశాలకు తమ మద్దతు ఉంటుందని ట్వీట్ చేశారు. అబుదాబిలో జరిగిన దాడుల్లో పాకిస్థాన్ పౌరుడొకరు చనిపోవడం బాధాకరమని పేర్కొన్నారు. కాగా ఇజ్రాయెల్ పీఎం నెతన్యాహుతో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఫోన్లో మాట్లాడారని, ఇరాన్లో ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీసినట్లు వైట్ హౌస్ వెల్లడించింది.
News February 28, 2026
MAR 6 నుంచి ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’: CM రేవంత్

TG: అభివృద్ధి ప్రణాళికల అమలుకు MAR 6 నుంచి ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ పేరిట 99days కార్యక్రమం నిర్వహించనున్నట్లు CM రేవంత్ తెలిపారు. ‘ప్రభుత్వ ఆఫీసులు ఇకపై అద్దె భవనాల్లో ఉండకూడదు. ఫైళ్ల క్లియరెన్స్ నిర్ధిష్ట సమయంలో జరగాలి. కంపెనీల ఒప్పందాలు, పెట్టుబడులు గ్రౌండ్ కావాలి. విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలి. 100 నియోజకవర్గాల్లో TG పబ్లిక్ స్కూళ్లు ప్రారంభించాలి’ అని అధికారులకు దిశానిర్దేశం చేశారు.


