News February 26, 2026

చర్లపల్లి: ఖైదీలకు నూనె తయారీపై శిక్షణ

image

చర్లపల్లి ఖైదీల వ్యవసాయ కాలనీ(పీఏసీ)లోని ఆయుర్వేద గ్రామంలో కోల్డ్‌ ప్రెస్‌ ఆయిల్‌ యూనిట్‌ను జైళ్ల శాఖ డీజీ డా.సౌమ్య మిశ్రా ప్రారంభించారు. 6 సంవత్సరాల విరామం అనంతరం ఆయుర్వేద గ్రామాన్ని పునః ప్రారంభించారు. ఖైదీల సంక్షేమం, పునరావాసానికి ఈ శిక్షణ కేంద్రం దోహదపడుతుందని ఆమె స్పష్టంచేశారు. కార్యక్రమంలో DIGలు శ్రీనివాస్, సంపత్, సూపర్డెంట్లు భరత్ ప్రమోద్, ఆయుర్వేద వైద్యులు, అధికారులు ఉన్నారు.

Similar News

News February 28, 2026

రెడ్‌బుక్‌లో జగన్ పేరు ఉందా? లోకేశ్ ఏమన్నారంటే..

image

AP: YCP హయాంలో తమ కార్యకర్తలు, ప్రజలపై తప్పుడు కేసులు పెట్టిన వారి పేర్లు రెడ్‌బుక్‌లో ఉన్నాయని లోకేశ్ తెలిపారు. ‘లా బ్రేక్ చేసిన, అందుకు ప్రేరేపించిన నేతలు, టార్చర్ చేసినవాళ్ల పేర్లు ఉంటాయి. జగన్ పేరు ఉందో లేదో త్వరలో తెలుస్తుంది. అటు SMలో 16ఏళ్ల లోపువారికి ఏజ్ అప్రాప్రియేట్ కంటెంటే కనిపించాలి. దీనిపై ఫ్రేమ్‌వర్క్‌కు కసరత్తు చేస్తున్నాం’ అని ముంబైలో జరిగిన ఐడియాస్ ఆఫ్ ఇండియా సదస్సులో అన్నారు.

News February 28, 2026

WI చేతిలో 3 సార్లు హార్ట్ బ్రేక్.. ఈసారి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాల్సిందే!

image

T20WC-2026లో భారత్ సెమీస్ చేరాలంటే మార్చి 1న కచ్చితంగా వెస్టిండీస్‌ను ఓడించి తీరాల్సిందే. అయితే పొట్టి ప్రపంచకప్‌లో ఈ రెండు జట్లు 4 సార్లు తలపడ్డాయి. మూడింట్లో విండీస్ గెలవగా, టీమ్ ఇండియా ఒకసారి మాత్రమే విజయం సాధించింది. 2009, 10లో సూపర్-8 దశలో, 2016లో సెమీఫైనల్లో ఓడించి భారత అభిమానుల హార్ట్ బ్రేక్ చేసింది. ఈసారి కూడా ఆ జట్టు బలంగా ఉంది. మరి WIను ఓడించాలంటే సూర్య సేన విజృంభించాల్సిందే.

News February 28, 2026

జగిత్యాల: మహిళకు పూర్తి రక్షణ కల్పించాం: డీడబ్ల్యూఓ

image

జగిత్యాల సఖి వన్ స్టాప్ సెంటర్ లో చోటుచేసుకున్న ఘటనపై జిల్లా సంక్షేమ అధికారి (DWO) కె. రాజ్ కుమార్ ప్రకటన విడుదల చేశారు. సెంటర్‌లో ఆశ్రయం పొందుతున్న మహిళకు పూర్తి రక్షణ కల్పించామని తెలిపారు. కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో గాయపడిన వ్యక్తి ప్రమాదం నుంచి బయటపడ్డాడని చెప్పారు. ఘటనపై సంబంధిత అధికారులు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.