News February 26, 2026

నెల్లూరు జిల్లాలో స్క్రబ్ టైఫస్‌తో ఒకరి మృతి?

image

నెల్లూరు జిల్లా బిట్రగుంట మండలం నాగులవరానికి చెందిన టీడీపీ నాయకుడు(47) చనిపోయారు. కావలిలో నివాసం ఉండే ఆయన వారం కిందట పొలం పనులకు వెళ్లినప్పుడు కాలికి ఏదో కుట్టినట్లు అనిపించింది. తర్వాత జ్వరం రావడంతో ఆసుపత్రికి వెళ్లారు. ఎంతకి తగ్గకపోవడంతో చెన్నైకి తీసుకెళ్లారు. ఈనెల 24వ తేదీ చనిపోయారు. స్క్రబ్ టైఫస్‌తో మరణించినట్లు డాక్టర్లు రిపోర్టు ఇచ్చారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.

Similar News

News February 27, 2026

మనుబోలు: రూ.4లక్షలతో పెట్రోల్ బంక్ ఉద్యోగి పరార్

image

నమ్మకంగా ఉంటూనే నగదుతో ఉడాయించిన ఘటన మనుబోలు మండలంలో చోటుచేసుకుంది. వెంకన్నపాలెంలోని ఇండియన్ పెట్రోల్ బంకులో మేనేజర్ కమ్ క్యాషియర్‌గా పనిచేస్తున్న కొలనుకుదురుకు చెందిన కుమార్ బంకులోని రూ.4 లక్షల నగదుతో పరారయ్యాడు. ఏడాదిగా పనిచేస్తున్న అతడు నగదుతో కనిపించకుండా పోవడంతో యజమాని రాజశేఖర్ రెడ్డి గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

News February 27, 2026

నెల్లూరు: అంతా ఒకే.. తరువాత ఏంటి.!

image

నెల్లూరు నగర పాలక సంస్థ మేయర్ కుర్చీ కొమ్ములాట సమసిపోయింది. రిజర్వేషన్ ప్రకారమే దేవరకొండ సుజాతకు పదవి దక్కింది. ఇక నుంచి NMCలో పెనుమార్పులు చోటు చేసుకొనున్నాయి. ఇప్పటికే ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్‌లో పలు సమస్యలు వెంటాడుతున్నాయి. ఈ క్రమంలో ఉన్న కొద్ది నెలల పదవీ కాలంలో సమస్యల పరిష్కారంలో ఏవిధంగా తన దైన మార్క్ చూపిస్తారని ప్రజలు ఎదురు చూస్తున్నారు.

News February 27, 2026

నెల్లూరు: అంతా ఒకే.. తరువాత ఏంటి.!

image

నెల్లూరు నగర పాలక సంస్థ మేయర్ కుర్చీ కొమ్ములాట సమసిపోయింది. రిజర్వేషన్ ప్రకారమే దేవరకొండ సుజాతకు పదవి దక్కింది. ఇక నుంచి NMCలో పెనుమార్పులు చోటు చేసుకొనున్నాయి. ఇప్పటికే ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్‌లో పలు సమస్యలు వెంటాడుతున్నాయి. ఈ క్రమంలో ఉన్న కొద్ది నెలల పదవీ కాలంలో సమస్యల పరిష్కారంలో ఏవిధంగా తన దైన మార్క్ చూపిస్తారని ప్రజలు ఎదురు చూస్తున్నారు.