News February 26, 2026

జీవీఎంసీ టౌన్ ప్లానింగ్‌పై కలెక్టర్ సీరియస్(2/2)

image

జీవీఎంసీలో టౌన్ ప్లానింగ్ అవినీతి జిల్లా కలెక్టర్‌కే చిర్రెత్తు కొచ్చేలా చేస్తోంది. పీజీఆర్ఎస్‌లో ప్రతీవారం పదుల సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో ఇటీవల టౌన్ ప్లానింగ్ అధికారులను పిలిచి కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను పీక్కుతింటే సహించేది లేదని, పనిచేయకపోతే సెలవు పెట్టి వెళ్లిపోవాలని హెచ్చరించారు. వీళ్లలో కొంత మందికి ఇప్పటికే రెండు సార్లు మెమోలు కూడా అందడం గమనార్హం.

Similar News

News February 27, 2026

విశాఖ: రోడ్డు ప్రమాదంలో కోర్టు ఉద్యోగి మృతి

image

విశాఖ రైల్వే స్టేషన్ గేట్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న ఒక వ్యక్తిని వేగంగా వచ్చిన ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు జిల్లా కోర్టులో పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కోర్టు సిబ్బంది మృతితో తోటి ఉద్యోగుల్లో విషాదం నెలకొంది.

News February 27, 2026

మార్చి 3న కనకమహాలక్ష్మీ అమ్మవారి దర్శనాలు నిలిపివేత

image

చంద్ర గ్రహణం సందర్భంగా మార్చి 3వ తేదిన ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8:30వరకు కనకమహాలక్ష్మీ అమ్మవారి ఆలయంలో దర్శనాలు నిలిపివేస్తునట్టు ఈఓ శోభారాణి తెలిపారు. ఆరోజు ఉదయం పంచామృతాభిషేకం అనంతరం గుడి మూసి వేయనున్నట్టు తెలిపారు. గ్రహణానంతరం రాత్రి సంప్రోక్షణ నిర్వహించి తిరిగి దర్శనాలకు అనుమతిస్తామన్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.

News February 27, 2026

అరుదైన క్యాన్సర్‌కు చికిత్స చేసిన కేజీహెచ్ వైద్యులు

image

ఐదు గంటల పాటు రోగికి సర్జరీ చేసి పునర్జన్మ ప్రసాదించారు కేజీహెచ్ వైద్యులు. మాడుగుల ప్రాంతానికి చెందిన43 ఏళ్ల వయసున్న వ్యక్తికి ఆబ్జెక్టివ్ జాండీస్ వ్యాధిగా నిర్ధారణ అయింది. వైద్యులు వెండి తేజేశ్వరరావు పరీక్షలు నిర్వహించి ఐదు గంటల పాటు శ్రమించి సర్జరీ చేశారు. అరుదైన క్యాన్సర్‌గా అధిక మరణాలు కలిగి ఉన్న ఈ వ్యాధి పూర్తిగా తగ్గేలా సర్జరీ చేసి చికిత్స అందించిన వైద్యులకు రోగి కృతజ్ఞతలు తెలిపారు.