News February 26, 2026
ADB: పరిషత్ పోరు జరగకుంటే.. రూ. 450 కోట్లు గల్లంతేనా..?

ZPTC, MPTC ఎన్నికల నిర్వహణపై సందిగ్ధత కొనసాగుతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు ఎన్నికలు పూర్తి చేయకపోతే 15వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన రూ.450 కోట్ల నిధులు నిలిచిపోయే ప్రమాదం ఉంది. BC రిజర్వేషన్ల కారణంగా వాయిదా పడుతూ వస్తున్న ఎన్నికలను మార్చి 2వ వారంలోపు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఉమ్మడి జిల్లాలోని 71 ZPTC, 579 MPTC స్థానాలకు పోలింగ్ నిర్వహించేందుకు యంత్రాంగం కసరత్తు చేస్తోంది.
Similar News
News February 28, 2026
MBNR: పీయూ.. ఎల్.ఎల్.బి పరీక్షలు!!

పాలమూరు విశ్వవిద్యాలయంలోని ఆకాడమిక్ భావనంలో L.L.M మొదటి సెమిస్టర్ ఎగ్జామ్స్ నిర్వహించారు. ఈ మేరకు పరీక్షలను పరీక్షల నియంత్రణా అధికారి డాక్టర్ కె.ప్రవీణ తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జె.మాళవి, న్యాయ కళాశాల హెచ్ఓడీ డాక్టర్ వి.రాధాకృష్ణ, జి.రవి, జగదీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
News February 28, 2026
ఇరాన్తో యుద్ధం.. USకు మద్దతిస్తున్న దేశాలివే!

మిడిల్ ఈస్ట్లోని సౌదీ అరేబియా, UAE, కువైట్, ఖతర్, బహ్రెయిన్, జోర్డాన్ తమ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలను కాపాడుకుంటూ మద్దతిస్తున్నాయి. ఇక వెస్ట్రర్న్ దేశాలైన జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ సైతం ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ను తీవ్రంగా తప్పుబడుతూ US వైపు నిలుస్తున్నాయి. ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ అమెరికాకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఇక ఇరుదేశాలకు మద్దతుపై భారత్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.
News February 28, 2026
కన్నడ భాష తెలిసిన పోలీసు సిబ్బందికై లేఖ: SP

ఉగాది మహోత్సవాల సందర్భంగా శ్రీశైలంలో విధులు నిర్వర్తించేందుకు కన్నడ భాష తెలిసిన పోలీస్ సిబ్బందిని కర్నూలు జిల్లా నుంచి రప్పించేందుకు ఇప్పటికే లేఖ రాసినట్లు SP సునీల్ షోరాణ్ వెల్లడించారు. శ్రీశైలంలో ఉగాది ఉత్సవాల సందర్భంగా శనివారం నిర్వహించిన సమన్వయ సమావేశంలో మాట్లాడారు. భక్తుల రద్దీని బట్టి 6వ తేదీ నుంచి వాలంటీర్లను నియమించే అంశంపై చర్చలు జరిపామని, భక్తుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు.


