News February 26, 2026
తెనాలిలో రేపు ఆయేషా మీరా అంత్యక్రియలు

ఆయేషా మీరా అస్థికలను సీబీఐ ఆమె తల్లిదండ్రులకు అప్పగించనుంది. రేపు తెనాలిలో భారీ బందోబస్తు నడుమ ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ కేసులో దర్యాప్తు సంస్థలన్నీ విఫలమయ్యాయని ఆయేషా తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు తమకు న్యాయం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కేసును హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని, డిసెంబర్ 27ను ఆయేషా సంస్మరణ దినంగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు.
Similar News
News March 4, 2026
జీజీహెచ్లో మెరుగైన వైద్యసేవలు అందించాలి: కలెక్టర్

గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా వైద్యులు నిబద్ధతతో విధులు నిర్వహించాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ప్రభుత్వ వైద్యశాల అధికారులను ఆదేశించారు. జీజీహెచ్ అధికారులతో కలెక్టరేట్లో బుధవారం కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. నైట్ షిప్ట్లలో విధులు నిర్వహించే విభాగాల వైద్యులు, క్యాజువాలిటి, రెసిడెన్షియల్ మెడికల్ ఆఫీసర్ డ్యూటీల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
News March 4, 2026
గుంటూరు జిల్లాలో 5 రేషన్ దుకాణాలపై కేసులు

గుంటూరు జిల్లాలో 5 చౌకధరల దుకాణాల పై కేసులు నమోదు చేసినట్లు JC అశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. జిల్లాలో ఇప్పటికి 244 రేషన్ షాపులను తనిఖీ చేశామని, తనిఖీల్లో సరుకులో వ్యత్యాశం గుర్తించి పెదకాకాని మండలంలో 3, ఫిరంగిపురంలో 1, నల్లచెరువులో 1 షాపు పై కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. కార్డుదారుల నుంచి అక్రమంగా పీడీఎస్ బియ్యం కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు అక్రమ రవాణా చేస్తున్న 4 వాహనాలను పట్టుకున్నామన్నారు.
News March 4, 2026
పెదకాకానిలో విషాదం.. నాలుగేళ్ల బాలిక మృతి

పెదకాకాని మండల కేంద్రానికి చెందిన శిరీషా (4) బుధవారం మృతి చెందింది. కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. శిరీషా ఆడుకుంటూ బూరను మింగింది. ఊపిరి ఆడక అస్వస్థతకు గురవడంతో గుంటూరు GGHకు తరలించారు. చికిత్స అందించినప్పటికి బాలిక ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.


