News February 26, 2026

ఇంటర్ ఎగ్జామ్స్: వరంగల్ జిల్లాలో ముగ్గురు డిబార్

image

వరంగల్ జిల్లా పర్వతగిరి సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో గురువారం నిర్వహించిన ఇంటర్ సెకండియర్ తెలుగు పరీక్షలో ముగ్గురు విద్యార్థులు డిబార్ అయినట్లు డీఐఈఓ శ్రీధర్ సుమన్ తెలిపారు. సోషల్ వెల్ఫేర్ సెంటర్లో 191 మందికి 188 మంది హాజరయ్యారు. మోడల్ స్కూల్ సెంటర్‌లో 177 మంది విద్యార్థులకు గాను 174 పరీక్ష రాశారు. ఒక్కో సెంటర్లో ముగ్గురు విద్యార్థుల చొప్పున ఆబ్సెంట్ అయ్యారు.

Similar News

News February 27, 2026

అర్హులైన ప్రతి బాధితుడికీ న్యాయం చేస్తాం: మంత్రి తుమ్మల

image

ఖమ్మం భూదాన్ భూముల్లో ఇళ్లు కోల్పోయిన అసలైన బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. బాధితులకు ఎక్కడ స్థలం ఉన్నా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని, స్థలం లేని పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. భూదాన్ స్థలాలను మోసపూరితంగా విక్రయించిన అక్రమార్కులను ఉపేక్షించేది లేదని, వారు జైలుకు వెళ్లడం ఖాయమని హెచ్చరించారు.

News February 27, 2026

చంద్రగ్రహణం: మార్చి 3న శ్రీశైల ఆలయం మూసివేత

image

పాక్షిక చంద్రగ్రహణం కారణంగా మార్చి 3న శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేయనున్నట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. ఉదయం 4:30 నుంచి 5:30 వరకు మాత్రమే అలంకార దర్శనం కల్పిస్తామన్నారు. ఉదయం 6 గంటలకు ఆలయం మూసివేస్తామని చెప్పారు. సాయంత్రం 7:30కు తిరిగి తెరిచి సంప్రోక్షణ నిర్వహించి, రాత్రి 9 నుంచి 10:30 వరకు భక్తులకు అలంకార దర్శనం కల్పిస్తామని వివరించారు.

News February 27, 2026

APPLY NOW: డిగ్రీ అర్హతతో 650 పోస్టులు

image

RBIలో 650 అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. డిగ్రీ అర్హత గలవారు మార్చి 8 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. ప్రిలిమినరీ, మెయిన్స్, LPT ద్వారా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.29,000-రూ.78,640 చెల్లిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.450+GST, SC,ST, PwBDలకు రూ.50+GST. వెబ్‌సైట్: https://rbi.org.in./