News February 26, 2026

జమ్మికుంట: స్వల్పంగా పెరిగిన పత్తి ధర

image

జమ్మికుంట మార్కెట్లో పత్తి ధర నిన్నటి కంటే ఈరోజు స్వల్పంగా పెరిగింది. బుధవారం క్వింటా పత్తి ధర రూ.7,550 పలుకగా.. గురువారం రూ.50 పెరిగి రూ.7,600 పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. నేడు మార్కెట్‌కు రైతులు 25 వాహనాల్లో 206 క్వింటాళ్ల విడి పత్తిని తీసుకువచ్చినట్లు చెప్పారు. మార్కెట్‌కు పత్తిని తీసుకువచ్చే రైతులు నాణ్యత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Similar News

News March 1, 2026

HNK: మావోయిస్టు లొంగుబాటు

image

జిల్లాలోని కాజీపేట మండలం తరాలపల్లికి చెందిన ముప్పిడి సాంబయ్య అలియాస్ వికాస్ ఛత్తీస్‌గఢ్ పోలీసుల ముందు లొంగిపోయారు. ఆయనతో పాటు మరో 15 మంది మావోయిస్టులు కూడా ఆయుధాలతో జనజీవన స్రవంతిలోకి వచ్చారు. వికాస్ ప్రస్తుతం ఒడిశా రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా ఉన్నారు. ఆయన లొంగుబాటుతో స్థానికంగా హర్షాతిరేకాలు వెలువెత్తాయి.

News March 1, 2026

సీఎం రేవంత్‌కు ధన్యవాదాలు: రాజగోపాల్ రెడ్డి

image

TG: సీఎం రేవంత్‌‌పై ఓ వైపు ప్రశంసలు కురిపిస్తూనే మరోవైపు తనదైన శైలిలో మునుగోడు MLA రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. ‘మునుగోడుకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేసినందుకు CMకు ధన్యవాదాలు. విద్యావ్యవస్థలో మార్పులు తెస్తున్నారు. గత ప్రభుత్వం విద్యను గాలికి వదిలేసింది’ అని అన్నారు. మరోవైపు హైదరాబాద్‌కు పక్కనే ఉన్న మునుగోడును పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అభివృద్ధిలో ఇంకా వెనుకబడి ఉందని పేర్కొన్నారు.

News March 1, 2026

హనుమకొండ జిల్లాలో తీవ్ర విషాదం

image

జిల్లాలోని కమలాపూర్ మండలం లక్ష్మీపూర్ వద్ద బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. శనిగరంలో స్నేహితుడి అంత్యక్రియలకు హాజరై శనిగరం నుంచి కమలాపూర్‌కు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. మృతులను శనిగరానికి చెందిన వట్టెంల నాగరాజు (20), బండి వినయ్ (18)గా గుర్తించారు.