News February 26, 2026

ఏలూరు జిల్లాలో ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు

image

ఏలూరు జిల్లావ్యాప్తంగా 56 కేంద్రాల్లో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్షలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 16,357 మంది విద్యార్థులకు గాను 15,972 మంది హాజరుకాగా, 385 మంది గైర్హాజరయ్యారు. జిల్లాలో 98 శాతం హాజరు నమోదైందని అధికారులు వెల్లడించారు. ఎక్కడా మాల్ ప్రాక్టీస్ వంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు పటిష్ట నిఘా ఏర్పాటు చేశాయి.

Similar News

News February 28, 2026

రౌడీల్లారా.. రాష్ట్రాన్ని విడిచి పలాయనం చేయండి: సీఎం

image

అలర్లు, దౌర్జన్యాలు, రౌడీయిజంతో బతికేద్దామనుకున్నవారు తక్షణమే రాష్ట్రాన్ని విడిచి పారిపోవాలని సీఎం చంద్రబాబు శనివారం జరిగిన రావివలస సభలో హెచ్చరించారు. మత్తులో తప్పు చేసే గంజాయి మూకలను చిత్తు చేస్తామన్నారు. ఆడబిడ్డల జోలికొస్తే ఖబడ్దార్ అని చంద్రబాబు తీవ్ర స్వరంతో హెచ్చరించారు. చెడు దారిలో వెళుతున్న వారి పట్ల కఠినంగా వ్యవహరించి దారిలో పెడతామని స్పష్టం చేశారు.

News February 28, 2026

NPDCL చరిత్రలోనే అత్యధిక విద్యుత్ వినియోగం

image

ఎన్పీడీసీఎల్ చరిత్రలోనే అత్యధిక గరిష్ఠ విద్యుత్ డిమాండ్ శనివారం నమోదయిందని సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి తెలిపారు. గత ఏడాది మార్చి 11న 5816 మెగావాట్లు గరిష్ఠ డిమాండ్ నమోదు కాగా.. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే అత్యధిక గరిష్ఠ విద్యుత్ డిమాండ్ 6057 మెగావాట్లు నమోదు కావడం గమనార్హం అన్నారు. నిరంతర విద్యుత్ సరఫరా అందించడానికి ముందస్తు ప్రణాళికతో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.

News February 28, 2026

AP కొత్త CSగా.. ప్రకాశం జిల్లా వాసి.!

image

AP చీఫ్ సెక్రెటరీగా <<19261711>>సాయిప్రసాద్<<>> నేడు బాధ్యతలు స్వీకరించారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం మట్టిగుంట గ్రామానికి చెందిన ఆయన 1991 IAS బ్యాచ్‌కు చెందిన అధికారి. తన సర్వీసులో కీలక పోస్టులలో పని చేశారు. 2024 జూన్ నుంచి జలవనరుల శాఖ కార్యదర్శిగా.. 2025 జనవరి నుంచి CM ఎక్స్ అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కూడా వ్యవహరించారు. 2019-24 మధ్య ఏపీ సోలార్ కార్పొరేషన్ CMDగా కూడా పనిచేశారు.