News February 26, 2026
TU: పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన ఉపకులపతి

తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. యూనివర్సిటీ కళాశాలలోని పరీక్ష కేంద్రాన్ని గురువారం వర్సిటీ ఉపకులపతి ఆచార్య యాదగిరిరావు, COE ఆచార్య సంపత్ కుమార్, కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య రాంబాబుతో కలిసి తనిఖీ చేశారు. ఉపకులపతి అధికారులకు తగిన సూచనలు చేస్తూ, పరీక్షలను సమర్థవంతంగా, పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు.
Similar News
News March 1, 2026
VZM: ఉదయాన్నే ప్రమాదం.. వ్యక్తి మృతి

రామభద్రపురం మండలం బూసాయవలస(ముచర్ల వలస) గ్రామ సమీపంలో సాయి కృష్ణ ఆగ్రో కోల్డ్ స్టోరేజ్ దగ్గర ఆదివారం ఉదయం ప్రమాదం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వాహనం ఢీకొని వృద్ధుడు మృతి చెందాడు. ఇతని వయసు సుమారు 65 ఏళ్లు ఉండవచ్చని భావిస్తున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీస్లు దర్యాప్తు చేస్తున్నారు.
News March 1, 2026
GNT: విషాదం.. పిల్లలకు టిఫిన్ తెచ్చేందుకు వెళ్లి దుర్మరణం

తెనాలిలోని పినపాడు మద్రాస్ రైల్వే గేట్ వద్ద ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. కరేటి సురేశ్ (45) తన పిల్లల కోసం టిఫిన్ తెచ్చేందుకు బయటకు వెళ్లి, పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. ఒకేసారి రెండు రైళ్లు రావడంతో గందరగోళానికి గురైన సురేశ్ను ఒకటో నెంబర్ ట్రాక్పై వస్తున్న రైలు బలంగా ఢీకొట్టింది. తలకు తీవ్ర గాయమై ఆయన ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.
News March 1, 2026
తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ

తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ భారీగా పెరిగింది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 22 గంటల సమయం పడుతోంది. శ్రీవారి దర్శనం కోసం శిలాతోరణం వరకు భక్తులు వేచి ఉన్నారు. శనివారం మొత్తం 75,428 మంది శ్రీవారిని దర్శించుకోగా, 36,240 మంది తలనీలాలు సమర్పించారు. అదే రోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.56 కోట్లుగా నమోదైంది.


