News February 26, 2026
NCERT పుస్తకంపై మోదీ అసంతృప్తి!

NCERT 8వ తరగతి పుస్తకంలో ‘న్యాయ వ్యవస్థలో అవినీతి’ పాఠ్యాంశంపై PM మోదీ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. జవాబుదారీతనం తీసుకురావాలని ఆదేశించారని ప్రభుత్వ వర్గాలు చెప్పినట్లు NDTV తెలిపింది. ఇదంతా ఎవరు చూసుకుంటున్నారని, 8వ తరగతి పిల్లలకు న్యాయవ్యవస్థలో అవినీతి గురించి ఎందుకు బోధించాలని ప్రశ్నించినట్లు సమాచారం. ఆ పుస్తకాన్ని CJI <<19243239>>నిషేధించడం<<>> తెలిసిందే.
Similar News
News February 28, 2026
రెడ్బుక్లో జగన్ పేరు ఉందా? లోకేశ్ ఏమన్నారంటే..

AP: YCP హయాంలో తమ కార్యకర్తలు, ప్రజలపై తప్పుడు కేసులు పెట్టిన వారి పేర్లు రెడ్బుక్లో ఉన్నాయని లోకేశ్ తెలిపారు. ‘లా బ్రేక్ చేసిన, అందుకు ప్రేరేపించిన నేతలు, టార్చర్ చేసినవాళ్ల పేర్లు ఉంటాయి. జగన్ పేరు ఉందో లేదో త్వరలో తెలుస్తుంది. అటు SMలో 16ఏళ్ల లోపువారికి ఏజ్ అప్రాప్రియేట్ కంటెంటే కనిపించాలి. దీనిపై ఫ్రేమ్వర్క్కు కసరత్తు చేస్తున్నాం’ అని ముంబైలో జరిగిన ఐడియాస్ ఆఫ్ ఇండియా సదస్సులో అన్నారు.
News February 28, 2026
WI చేతిలో 3 సార్లు హార్ట్ బ్రేక్.. ఈసారి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాల్సిందే!

T20WC-2026లో భారత్ సెమీస్ చేరాలంటే మార్చి 1న కచ్చితంగా వెస్టిండీస్ను ఓడించి తీరాల్సిందే. అయితే పొట్టి ప్రపంచకప్లో ఈ రెండు జట్లు 4 సార్లు తలపడ్డాయి. మూడింట్లో విండీస్ గెలవగా, టీమ్ ఇండియా ఒకసారి మాత్రమే విజయం సాధించింది. 2009, 10లో సూపర్-8 దశలో, 2016లో సెమీఫైనల్లో ఓడించి భారత అభిమానుల హార్ట్ బ్రేక్ చేసింది. ఈసారి కూడా ఆ జట్టు బలంగా ఉంది. మరి WIను ఓడించాలంటే సూర్య సేన విజృంభించాల్సిందే.
News February 28, 2026
పాక్తో మేము చర్చలకు సిద్ధం: అఫ్గానిస్థాన్

పాక్తో యుద్ధం ముదురుతున్న నేపథ్యంలో చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని అనుకుంటున్నట్లు అఫ్గానిస్థాన్ ప్రకటించింది. కాగా ఇప్పటికే ఈ ఉద్రిక్తతలపై వెనక్కి తగ్గాలని చైనా, బ్రిటన్ సహా పలు దేశాలు సూచించాయి. అఫ్గాన్తో పోరులో 274 మంది తాలిబన్లను అంతం చేశామని మరో 400 మంది గాయపడినట్లు పాకిస్థాన్ ప్రకటించింది. అంతకుముందు తమ దాడుల్లో 50 మంది పాకిస్థాన్ జవాన్లు చనిపోయినట్లు తాలిబన్ సర్కార్ చెప్పుకొచ్చింది.


