News February 26, 2026
అకాల వర్షాలకు 498 ఎకరాల్లో మొక్కజొన్నకు నష్టం: జేడీ

ఏలూరు జిల్లాలో ఇటీవల కురిసిన అకాల వర్షాలు, ఈదురుగాలులకు 498 ఎకరాల్లో మొక్కజొన్న పంట దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ జేడీ హబీబ్ బాషా తెలిపారు. గురువారం ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టాన్ని అంచనా వేశారు. పొట్టదశలో ఉన్న పంట దెబ్బతినడంతో 6 మండలాలు, 31 గ్రామాల పరిధిలోని 330 మంది రైతులు నష్టపోయారని వివరించారు. ప్రభుత్వానికి నివేదిస్తామని ఆయన స్పష్టం చేశారు.
Similar News
News February 28, 2026
రెడ్బుక్లో జగన్ పేరు ఉందా? లోకేశ్ ఏమన్నారంటే..

AP: YCP హయాంలో తమ కార్యకర్తలు, ప్రజలపై తప్పుడు కేసులు పెట్టిన వారి పేర్లు రెడ్బుక్లో ఉన్నాయని లోకేశ్ తెలిపారు. ‘లా బ్రేక్ చేసిన, అందుకు ప్రేరేపించిన నేతలు, టార్చర్ చేసినవాళ్ల పేర్లు ఉంటాయి. జగన్ పేరు ఉందో లేదో త్వరలో తెలుస్తుంది. అటు SMలో 16ఏళ్ల లోపువారికి ఏజ్ అప్రాప్రియేట్ కంటెంటే కనిపించాలి. దీనిపై ఫ్రేమ్వర్క్కు కసరత్తు చేస్తున్నాం’ అని ముంబైలో జరిగిన ఐడియాస్ ఆఫ్ ఇండియా సదస్సులో అన్నారు.
News February 28, 2026
WI చేతిలో 3 సార్లు హార్ట్ బ్రేక్.. ఈసారి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాల్సిందే!

T20WC-2026లో భారత్ సెమీస్ చేరాలంటే మార్చి 1న కచ్చితంగా వెస్టిండీస్ను ఓడించి తీరాల్సిందే. అయితే పొట్టి ప్రపంచకప్లో ఈ రెండు జట్లు 4 సార్లు తలపడ్డాయి. మూడింట్లో విండీస్ గెలవగా, టీమ్ ఇండియా ఒకసారి మాత్రమే విజయం సాధించింది. 2009, 10లో సూపర్-8 దశలో, 2016లో సెమీఫైనల్లో ఓడించి భారత అభిమానుల హార్ట్ బ్రేక్ చేసింది. ఈసారి కూడా ఆ జట్టు బలంగా ఉంది. మరి WIను ఓడించాలంటే సూర్య సేన విజృంభించాల్సిందే.
News February 28, 2026
జగిత్యాల: మహిళకు పూర్తి రక్షణ కల్పించాం: డీడబ్ల్యూఓ

జగిత్యాల సఖి వన్ స్టాప్ సెంటర్ లో చోటుచేసుకున్న ఘటనపై జిల్లా సంక్షేమ అధికారి (DWO) కె. రాజ్ కుమార్ ప్రకటన విడుదల చేశారు. సెంటర్లో ఆశ్రయం పొందుతున్న మహిళకు పూర్తి రక్షణ కల్పించామని తెలిపారు. కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో గాయపడిన వ్యక్తి ప్రమాదం నుంచి బయటపడ్డాడని చెప్పారు. ఘటనపై సంబంధిత అధికారులు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.


