News February 27, 2026
రైల్వేస్టేషన్లో స్పృహ కోల్పోయిన వ్యక్తి మృతదేహం ఇంకా మార్చురిలోనే

విశాఖ రైల్వేస్టేషన్లో ఈ నెల23న ప్లాట్ఫారం1 గేట్ నం.3 సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి స్పృహ కోల్పోయి పడిపోయాడు. ఆ వ్యక్తిని రైల్వేపోలీసులు గమనించి KGHకి తరలించగా, చికిత్స పొందుతూ ఈ నెల 24న మృతి చెందాడు. ఆ మృతదేహం ఇంకా KGH మార్చూరిలో ఉండగా, మృతుడి వివరాల కోసం రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి ఆరా తీస్తున్నారు. మృతుడి వివరాలు తెలిసినవారు రైల్వే GRP పోలీసులను సంప్రదించాలని కోరారు.
Similar News
News March 2, 2026
ప్రశాంతంగా ముగిసిన ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ పరీక్ష

జిల్లావ్యాప్తంగా సోమవారం జరిగిన ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ పరీక్షలు శాంతియుతంగా ముగిశాయని DEO ఎన్. ప్రేమకుమార్ తెలిపారు. మొత్తం 972 మంది అభ్యర్థులకు గాను 884 మంది హాజరు కాగా, 88 మంది గైర్హాజరయ్యారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగిన ఈ పరీక్షల కోసం 6 కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీ చేశాయి. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని ఆయన పేర్కొన్నారు
News March 2, 2026
టీడీఆర్ల మంజూరులో అవినీతికి తావివ్వొద్దు: ప్రణవ్

వీఎంఆర్డీఏ చేపడుతున్న పనుల్లో అధికారులు నిర్లక్ష్యం ఆలసత్వం చూపించవద్దని కమిషనర్ తేజ్ భరత్ చైర్మన్ ప్రణవ్ గోపాల్ అన్నారు. ఆయన కార్యాలయంలో సోమవారం అధికారులతో అభివృద్ధి పనులు, లేఅవుట్లు, రహదారి విస్తరణ పనులపై సమీక్ష చేశారు. విస్తరణలో ఆస్తులు కోల్పోయిన వారికి టీడీఆర్ల మంజూరులో అవినీతి ఉండకూడదన్నారు. సకాలంలో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు
News March 2, 2026
కలెక్టర్ పీజీఆర్ఎస్కు 252 వినతులు

విశాఖలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్కు 272 మంది ఫిర్యాదులు చేశారని అధికారులు తెలిపారు. ఫిర్యాదులను స్వయంగా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ విద్యాధరి బాధితుల నుంచి స్వీకరించారు. కొన్ని ఫిర్యాదులు ఆయా విభాగాల అధికారులను పిలిచి కలెక్టర్ అందజేయగా జీవీఎంసీకి సంబంధించిన టౌన్ ప్లానింగ్ ఇతర ఫిర్యాదులపై క్షుణ్ణంగా పరిశీలించారు.


