News May 3, 2024

పథకాలకు నిధుల చెల్లింపులు.. ఈసీకి ప్రభుత్వం లేఖ

image

AP: పథకాలకు సంబంధించిన నిధులను విడుదల చేసేందుకు ప్రభుత్వం ఎన్నికల సంఘం అనుమతి కోరింది. డీబీటీ చెల్లింపులు చేసేందుకు అనుమతి ఇవ్వాలని లేఖ రాసింది. పథకాలన్నీ ఐదేళ్లుగా అమలవుతున్నవేనని తెలిపింది. కాగా పెన్షన్ల తరహాలోనే డీబీటీ చెల్లింపులను TDP అడ్డుకుంటోందని YCP ఆరోపిస్తోంది. EBC నేస్తం, చేదోడు వంటి పథకాల నిధులను CM జగన్ మార్చిలోనే బటన్ నొక్కి విడుదల చేసినా ఎన్నికల కోడ్ దృష్ట్యా జమ కాలేదు.

Similar News

News November 3, 2025

బస్సు ప్రమాదంపై చంద్రబాబు, పవన్ దిగ్భ్రాంతి

image

మీర్జాగూడ <<18183773>>బస్సు<<>> ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనలో ప్రయాణికుల మృతి తీవ్రంగా కలచివేసిందని చంద్రబాబు తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతుల కుటుంబాలకు పవన్ సైతం సానుభూతి ప్రకటించి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.

News November 3, 2025

ఈనెల 5న మెగా జాబ్ మేళా

image

AP: అనకాపల్లి జిల్లా చోడవరం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఈనెల 5న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటిఐ, డిప్లొమా, పీజీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు హాజరుకావొచ్చు. 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఈ జాబ్ మేళాలో 18 మల్టీ నేషనల్ కంపెనీలు పాల్గొననున్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు naipunyam.ap.gov.in వెబ్ సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

News November 3, 2025

ఎటు చూసినా మృతదేహాలే..

image

TG: చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి <<18183773>>బస్సు<<>> ప్రమాద మృతుల బంధువుల ఆర్తనాదాలతో దద్దరిల్లిపోయింది. ఎటు చూసినా మృతదేహాలే కనిపిస్తుండడంతో ఆ ప్రాంతం శ్మశానాన్ని తలపిస్తోంది. ఆసుపత్రిలో సరిపడా బెడ్లు లేకపోవడంతో క్షతగ్రాతులను బెంచ్‌లపై పడుకోబెట్టి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో పలువురిని ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. మరోవైపు మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తారని సమాచారం.