News May 3, 2024

కమలాపురం: హత్య కేసులో నిందితులు అరెస్టు

image

గత నెల 30వ తేదీన కమలాపురంలో <<13149211>>యువకుడు హత్యకు<<>> గురైన విషయం తెలిసిందే. తాజాగా నిందితులను కమలాపురం పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల మేరకు.. మృతుడు సయ్యద్ మహమ్మద్ ఘనికి ఇందిరమ్మ కాలనీకి చెందిన షేక్ ముబారక్ అనే వ్యక్తికి మధ్య జరిగిన చిన్నపాటి గొడవలే కారణమన్నారు. ముబారక్‌తో పాటు మరో 9 మంది హత్య కేసులో నిందితులను పందిర్లపల్లె వద్ద డీఎస్పీ షరీఫ్ ఆదేశాలతో అరెస్టు చేసినట్లు తెలిపారు.

Similar News

News March 12, 2026

వంట గ్యాస్ బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తే చర్యలు: జేసీ నిధి మీనా

image

కడప జిల్లాలో వంట గ్యాస్ బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తే చర్యలు తప్పవని జిల్లా జాయింట్ కలెక్టర్ నిధి మీనా హెచ్చరించారు. వంట గ్యాస్ డిమాండ్, సరఫరా, పంపిణీ, కృత్రిమ కొరత, బ్లాక్ మార్కెట్ తదితర వాటిపై గురువారం కడపలో జేసీ సంబంధిత అధికారులు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు, డీలర్లతో సమీక్ష నిర్వహించారు. వంట గ్యాస్ పక్క దారి పట్టకుండా ఏజెన్సీలు డెలివరీ సిబ్బందిపై నిరంతరం పటిష్టమైన నిఘా పెట్టాలన్నారు.

News March 12, 2026

వంట గ్యాస్ బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తే చర్యలు: జేసీ నిధి మీనా

image

కడప జిల్లాలో వంట గ్యాస్ బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తే చర్యలు తప్పవని జిల్లా జాయింట్ కలెక్టర్ నిధి మీనా హెచ్చరించారు. వంట గ్యాస్ డిమాండ్, సరఫరా, పంపిణీ, కృత్రిమ కొరత, బ్లాక్ మార్కెట్ తదితర వాటిపై గురువారం కడపలో జేసీ సంబంధిత అధికారులు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు, డీలర్లతో సమీక్ష నిర్వహించారు. వంట గ్యాస్ పక్క దారి పట్టకుండా ఏజెన్సీలు డెలివరీ సిబ్బందిపై నిరంతరం పటిష్టమైన నిఘా పెట్టాలన్నారు.

News March 12, 2026

కడప: 10th పరీక్షలు.. సమస్యాత్మక పరీక్షా కేంద్రాలు ఇవే.!

image

కడప: ఈనెల 16నుంచి 10th పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జిల్లాలో 28,152 మంది విద్యార్థులు 10th పరీక్షలు రాయనున్నారు. వీరిలో రెగ్యులర్ 27,731, ప్రైవేట్ 421మంది విద్యార్థులు ఉన్నారు. బాలురు 14,486, బాలికలు 13,666 మంది ఉన్నారు. వీరి కోసం 167 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. కందిమల్లాయపల్లె, కమలాపురం, వేంపల్లె, మైదుకూరు, వల్లూరు, ఎగువపేట పరీక్ష కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు.