News February 27, 2026
గోల్డ్, సిల్వర్ ETFలు ఇక దేశీయ ధరల్లోనే

ఏప్రిల్ 1 నుంచి గోల్డ్, సిల్వర్ ETFల వాల్యుయేషన్ పద్ధతి మారుతోంది. ఇకపై అంతర్జాతీయ LBMA ధరలకు బదులు మన దేశీయ స్టాక్ ఎక్స్ఛేంజీలు ప్రకటించే ‘స్పాట్ ధరల’ ఆధారంగా వీటి విలువను లెక్కిస్తారు. దీంతో ధరల్లో పారదర్శకత పెరిగి, మన మార్కెట్ పరిస్థితులకు తగ్గట్టుగా రేట్లు ఉంటాయి. అలాగే విపరీతమైన హెచ్చుతగ్గులను అరికట్టడానికి సెబీ 15 నిమిషాల ‘కూలింగ్-ఆఫ్’ పీరియడ్ను కూడా ప్రవేశపెట్టింది.
Similar News
News March 3, 2026
ఈ ప్రధాన పంటలకు ఈ ఎర పంటలతో మేలు

☛ వరి చుట్టూ జీలుగ వేసి కాండం తొలిచే పురుగు ఉద్ధృతి తగ్గించవచ్చు. ☛ మొక్కజొన్న చుట్టూ జొన్న మొక్కలను నాటి మొవ్వు ఈగ, కాండం తొలిచే పురుగును కట్టడి చేయొచ్చు. ☛ చెరకు పంట చుట్టూ కుంకుమ బంతి, సోయా చిక్కుడు వేసి నులి పురుగులను నివారించవచ్చు. ☛ పొగాకు చుట్టూ ఆముదం పంట వేసి పొగాకు లద్దె పురుగులను నియంత్రించవచ్చు. ☛ మిరప చుట్టూ ఆముదం పంట వేసి కాయతొలుచు పురుగులను కట్టడి చేయొచ్చు.
News March 3, 2026
ఏఐ కల్పిత తీర్పులపై సుప్రీంకోర్టు హెచ్చరిక

ఏఐ కల్పిత తీర్పులపై అప్రమత్తంగా ఉండాలని సుప్రీంకోర్టు హెచ్చరించింది. వాటి వల్ల న్యాయ ప్రక్రియ దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఏపీలోని ఓ ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పులో అసలు ఉనికిలోనే లేని కేసు లాస్ను ప్రస్తావించినట్లు పిటిషనర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు దీనిని సీరియస్గా తీసుకుంది.
News March 3, 2026
సాయుధుల ఊచకోత.. 169 మంది మృతి

దక్షిణ సూడాన్లోని ఓ గ్రామంలో సాయుధులు జరిపిన దాడిలో 169 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతర్యుద్ధంలో భాగంగా ప్రతిపక్ష నేత రీక్ మచర్ మద్దతుదార్లు ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. 90 మంది సాధారణ పౌరులు చనిపోయారని.. మృతుల్లో పిల్లలు, మహిళలు ఉన్నట్లు UN మిషన్ వెల్లడించింది. ఈ దాడి తర్వాత వెయ్యి మంది తమను ఆశ్రయించినట్లు తెలిపింది. చర్చల ద్వారా ప్రెసిడెంట్, ప్రతిపక్ష నేతలు సంధి కుదుర్చుకోవాలని కోరింది.


