News February 27, 2026

మేడ్చల్: వృద్ధుడికి సెంచరీ సెలబ్రేషన్స్.. అంతలోపే

image

ఆయనకు నిండునూరేళ్లు నిండాయి. గ్రాండ్‌గా సెలబ్రేషన్స్ చేద్దామని కుటుంబం ఏర్పాట్లు చేసుకుంది. అంతలోనే ఆ వృద్ధుడు మృతిచెందారు. బీదర్‌కు చెందిన దొండచార్య జోషి(100) బోడుప్పల్ గాయత్రినగర్‌లో స్థిరపడ్డారు. బీదర్ HYD సంస్థానంలో ఉన్న సమయంలో రజాకార్ల దౌర్జన్యంపై ఈయన దండెత్తారు. KA, MH రాష్ట్రాల విభజనలో పాల్గొన్నారు. గతేడాది బోడుప్పల్‌లో అఖిల బ్రాహ్మణ వికాస సమితీ ఆధ్వర్యంలో 99వ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు.

Similar News

News March 1, 2026

HYDలో అవినీతి ‘సిస్టమ్’ మారేనా?

image

GHMC పరిధిలో ACB దాడుల పరంపర కేవలం అధికారుల అవినీతిని బయటపెట్టడమే కాదు.. వ్యవస్థలో పాతుకుపోయిన ‘పర్సెంటేజీ’ల దందాను కూడా ఎండగడుతోంది. చట్టపరంగా చూస్తే 64 శాతం శిక్షా రేటు అనేది న్యాయస్థానాలు అవినీతిపై చూపిస్తున్న కఠిన వైఖరికి నిదర్శనం. రాజకీయంగా కూడా ప్రభుత్వం 115 ప్రాసిక్యూషన్ శాంక్షన్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం. అయితే, శిక్షలు ఒకవైపు.. వ్యవస్థ ప్రక్షాళన మరోవైపు సాగాల్సిందే!

News March 1, 2026

HYD: పాతబస్తీలో రోబోటిక్ టెక్నాలజీతో డీ-సిల్టింగ్!

image

పాతబస్తీలోని మురుగునీటి సమస్యల పరిష్కారానికి జలమండలి కొత్త రోబోటిక్ టెక్నాలజీని ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. విజయనగర్ కాలనీ సెక్షన్ పరిధిలోని మల్లేపల్లి ఎక్స్ రోడ్ వద్ద డీ-సిల్టింగ్ పనులను జలమండలి MD అశోక్ రెడ్డి, హైడ్రాకమిషనర్ రంగనాథ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సీవర్ లైన్లలో ఏర్పడిన పూడికను తొలగించడానికి ఉపయోగపడుతుందన్నారు. ఆధునిక పద్ధతులతో త్వరగా సమస్యలను పరిష్కరించడమే లక్ష్యమని అన్నారు.

News February 28, 2026

HYD: సౌండ్ వద్దు.. Midnight Silence ముద్దు!

image

పబ్బుల హోరు.. DJల జోరు వదిలేసి హైటెక్ సిటీ Gen Z ‘నిశ్శబ్దాన్ని’ వెతుక్కుంటోంది. అర్ధరాత్రి దాటాక గచ్చిబౌలి సర్వీస్ రోడ్ల మీద కార్లు ఆపి ఎటువంటి సౌండ్ లేకుండా కేవలం ఆకాశాన్ని చూస్తూ గడపడం కొత్త ట్రెండ్. దీని పేరు కార్ పార్కింగ్ థెరపీ. ఒత్తిడిని జయించడానికి మందు అవసరం లేదు. మెట్రో రైలు శబ్దం వింటూ కారులో కునుకు తీస్తే చాలు అంటున్నారు. వినడానికి వింతగా ఉన్నా ఈ అర్బన్ సన్యాసులకు ఇదే ప్రశాంతంగా ఉందట.