News February 27, 2026

HYD: ప్రేమ వివాహం.. యువకుడిపై యువతి సోదరుడి దాడి

image

ప్రేమ వివాహం చేసుకున్నాడన్న కోపంతో యువకుడిపై దాడి చేశారు కొందరు దుండగులు. నేరెడ్‌మెట్‌కు చెందిన అజయ్‌ను రామలింగంపల్లి గ్రామ శివారులోకి పిలిపించి యువతి సోదరుడు, అతని స్నేహితులు కారం చల్లి కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అజయ్‌ను పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు.

Similar News

News March 3, 2026

ఈ నెల 23న డీసీఎంఎస్ సర్వసభ్య సమావేశం

image

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా డీసీఎంఎస్ సర్వసభ్య సమావేశం ఈ నెల 23న నిర్వహిస్తున్నట్లు ఛైర్మన్ పెచ్చెట్టి చంద్రమౌళి తెలిపారు. కాకినాడలోని డీసీఎంఎస్ కార్యాలయంలో మంగళవారం ముందస్తు సమీక్ష నిర్వహించి ఏర్పాట్లపై చర్చించారు. ఈ సమావేశానికి సభ్యులు, అధికారులు అందరూ విధిగా హాజరుకావాలని సూచించారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ సీఈవో, బాపిరాజు, మేనేజర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.

News March 3, 2026

ఇందుకూరుపేట: వేటకు వెళ్లి ఒకరు మృతి

image

ఇందుకూరుపేట మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గంగపట్నం ఎస్సీ కాలనీకి చెందిన ఏలూరు వెంకటరమణయ్య చేపల వేట కోసం సమీపంలోని ఉప్పుటేరుకు వెళ్లారు. అక్కడ వేట సాగిస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి ఆయనను బయటకు తీశారు. అయితే దురదృష్టవశాత్తు అప్పటికే వెంకటరమణయ్య ప్రాణాలు కోల్పోయారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు.

News March 3, 2026

మెట్రో ఫేజ్-2 వారసత్వ కట్టడాల సవాలు

image

HYD మెట్రో ఫేజ్-2 విస్తరణలో పాతబస్తీ కారిడార్ ఇప్పుడు అధికారులకు పరీక్షగా మారింది. వారసత్వ కట్టడాల రక్షణపై హైకోర్టు నిబంధనలు కఠినంగా ఉండటంతో అలైన్‌మెంట్‌లో సాంకేతిక మార్పులు తప్పనిసరయ్యాయి. అటు L అండ్ T నుంచి ప్రాజెక్టు బాధ్యతల బదిలీపై ప్రభుత్వ కసరత్తు సాగుతుండగా ₹42,000 కోట్ల భారీ వ్యయంలో కేంద్రం 20% వాటాపై ఇంకా స్పష్టత రాలేదు. ట్రాఫిక్ డెన్సిటీ అంచనాలపై కేంద్రం కొర్రీలు వేస్తున్నట్లు సమాచారం.