News February 27, 2026

విపక్షాలే టార్గెట్‌గా సీబీ‘ఐ’.. ఆరోపణలకు బలం చేకూరిందా?

image

విపక్షాలను టార్గెట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం CBI, EDలను వాడుకుంటోందనేది ఎంతో మంది ఆరోపణ. అక్రమ కేసుల్లో ఇరికించి నాయకుల క్రెడిబిలిటీని నాశనం చేయడం, జైలుకు పంపడమే లక్ష్యమన్న విమర్శలున్నాయి. ఈ వాదనలకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుపై తీర్పుతో బలం చేకూరిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆధారాల్లేకుండానే కేసు నమోదు చేసినందుకు CBI అధికారులపైనే విచారణ చేయాలని కోర్టు చెప్పడమే నిదర్శనమంటున్నారు.

Similar News

News March 6, 2026

కూలిన సుఖోయ్.. ధర ఎంత ఉంటుందంటే?

image

సుఖోయ్ ఫైటర్ జెట్ Su-30MKI నిన్న శిక్షణ సమయంలో అస్సాంలోని జోర్హట్‌కు 60KM దూరంలో కూలినట్లు ఇండియన్ ఫోర్స్ ధ్రువీకరించింది. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని చెప్పింది. అయితే యుద్ధ విమానం ధర ఎంత ఉంటుందనే చర్చ జరుగుతోంది. గతేడాది భారత్ 12 ఫైటర్ జెట్ల కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చి రూ.13,500CR కేటాయించింది. దాని ప్రకారం ఒక్కో Su-30MKI రూ.1,000కోట్లకు పైగా ఉంటుంది. ప్రస్తుతం IND వద్ద 260+ సుఖోయ్ జెట్లు ఉన్నాయి.

News March 6, 2026

బుమ్రా అందుకు అర్హుడు: సంజూ శాంసన్

image

T20 WC సెమీస్‌లో ఇంగ్లండ్‌పై <<19308021>>ఉత్కంఠ పోరు<<>>లో టీమ్ ఇండియా గెలిచిన విషయం తెలిసిందే. చివర్లో కట్టుదిట్టమైన బౌలింగ్‌తో మ్యాచ్‌ను మన కంట్రోల్‌లోకి తెచ్చిన బుమ్రాపై సంజూ శాంసన్ ప్రశంసలు కురిపించారు. ‘బుమ్రా ప్రపంచ స్థాయి బౌలర్. అతడు అలా బౌలింగ్ చేయకపోయి ఉంటే నేను POTMను అందుకునే వాడిని కాదు. ఈ అవార్డుకు నా కన్నా తనే ఎక్కువ అర్హుడు. డెత్ ఓవర్లలో అసాధారణ ప్రదర్శన చేశాడు’ అని కొనియాడారు.

News March 6, 2026

మొక్క జొన్న రైతుల బకాయిలు విడుదల

image

TG: మొక్క జొన్న రైతుల పెండింగ్ బకాయిలను ప్రభుత్వం విడుదల చేసింది. మార్క్‌ఫెడ్‌కు ₹171 కోట్లు రిలీజ్ చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఒకటీరెండు రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు చెప్పారు. ‘వానాకాలానికి సంబంధించి 78,500 మంది నుంచి 3.77 లక్షల టన్నుల మొక్కజొన్నలు మార్క్‌ఫెడ్ కొనుగోలు చేసింది. తొలిదశలో ₹735.39 కోట్లు చెల్లించాం. మిగతా నిధులను తాజాగా రిలీజ్ చేశాం’ అని పేర్కొన్నారు.