News February 27, 2026

టమాటా మిర్చి అ’ధర’హో.. ఒక్కరోజే రూ.10వేలు పెరిగింది

image

TG: టమాటా మిర్చి రకం రైతులకు కాసుల వర్షం కురిపిస్తోంది. వరంగల్(D) ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఇవాళ ఈ మిర్చి క్వింటా ధర ఏకంగా రూ.50,000 పలికింది. ఈ నెల 18న క్వింటా రూ.35,000, 19న రూ.36,000, 23న రూ.37,000, 25, 26న రూ.40,000 ధరకు వ్యాపారులు కొనుగోలు చేశారు. ఇవాళ ఒక్క రోజే క్వింటాకు రూ.10,000 పెరిగింది. 9 రోజుల్లో క్వింటా టమాటా మిర్చి ధర రూ.15వేలు పెరగడంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News February 28, 2026

అమెరికాVsఇరాన్.. ఎవరి బలం ఎంత?

image

☛ డిఫెన్స్ బడ్జెట్: USA $895B, ఇరాన్ $15.4B
☛ యాక్టివ్ మిలిటరీ సిబ్బంది: USA 13.28L, ఇరాన్ 6.10L
☛ రిజర్వ్ మిలిటరీ: USA 7.99L, Iran 3.5L
☛ ఎయిర్‌క్రాఫ్ట్ ఫైటర్స్: USA 1,790, Iran:188
☛ న్యూక్లియర్ వార్ హెడ్స్: USA: 5,244, Iran: 0
☛ అటాక్ హెలికాప్టర్లు: USA: 1,002, Iran: 13
☛ ట్యాంక్స్: USA: 4,640, Iran: 1,713
☛ సబ్‌మెరైన్స్: USA: 70, Iran: 25

News February 28, 2026

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం.. సంయమనం పాటించాలన్న భారత్

image

మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ పరిస్థితిపై ఆందోళన చెందుతున్నట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఇరుపక్షాలు సంయమనం పాటించాలని కోరింది. US, ఇజ్రాయెల్, ఇరాన్ ఉద్రిక్తతలు తగ్గించి, పౌరుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలంది. మరోవైపు మిడిల్ ఈస్ట్‌ దేశాల్లో ఉద్రిక్తత వేళ DGCA కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయా దేశాలకు విమాన సర్వీసులు తాత్కాలికంగా నిలిపేయాలని పేర్కొంది. కాగా Air India ఇప్పటికే తన సర్వీసులను రద్దు చేసింది.

News February 28, 2026

కోకాపేట భూములు శారదా పీఠానికే ఇవ్వండి: CM రేవంత్

image

TG: కోకాపేటలోని భూమిని శారదా పీఠానికే కొనసాగించాలని CM రేవంత్ నిర్ణయించారు. పీఠం భూములను జలమండలికి కేటాయించడంతో వివాదం మొదలైంది. ఇవాళ హరీశ్ రావు సైతం అక్కడికి వెళ్లి మద్దతు తెలిపారు. అయితే కేటాయింపు భూముల్లో సాగుతున్న నిర్మాణ పనుల విషయాన్ని ముందే ఎందుకు చెప్పలేదని అధికారులపై CM ఆగ్రహం వ్యక్తం చేశారు. జలమండలికి భూముల కేటాయింపు రద్దు చేసి, శారదా పీఠానికే కొనసాగించాలని ఆదేశించారు.