News February 27, 2026
TTD అన్నదానం విరాళాల్లో మార్పులు!

తిరుమల శ్రీవారి అన్నదానంలో రోజువారి విరాళంతో పాటు తక్కువ మందికీ అన్నదానం చేసే వెసులుబాటు కల్పించేలా టీటీడీ ప్రయత్నాలు చేస్తోంది. 10, 100మందికి చొప్పున కూడా విరాళం ఇచ్చే అవకాశాన్ని కల్పించి.. సామాన్య భక్తులను అన్నదానంలో భాగం చేయాలని ఆలోచన చేస్తోంది. ప్రస్తుతం రోజు మొత్తానికి రూ.44లక్షలు, ఉదయం టిఫిన్కు రూ.10లక్షలు, రాత్రి, మధ్యాహ్న భోజనానికి రూ.17లక్షల చొప్పున విరాళాలు ఇచ్చే అవకాశమే ఉంది.
Similar News
News March 1, 2026
గ్రేటర్ వరంగల్పై వారసుల గురి!

త్వరలో జరగబోయే గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలపై నేతల వారసులు కన్నేశారు. ఈసారి మేయర్ సీటు జనరల్కు రిజర్వు కావడంతో, మాజీ ఎమ్మెల్యేలు గురిపెట్టి ఉండగా.. కొందరు నేతల కుమారులు, కుమార్తెలు సైతం తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దమవుతున్నారు. వీరిలో దాస్యం అభినవ్ భాస్కర్, విష్ణువర్థన్ రెడ్డి, బస్వరాజు శ్రీమాన్, కొండా సుష్మితా పటేల్, ఆరూరి విశాల్, దిలీప్ తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి.
News March 1, 2026
కడప జిల్లాలో కీలక పోస్టుల్లో ఇన్ఛార్జ్ల పాలన.!

కడపలో 2018 గ్రూప్-1 నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన జిల్లాలోని పలువురు అధికారులు హైకోర్టు ఆదేశాలతో GADలో రిపోర్ట్ చేశారు. కడప కార్పొరేషన్ కమిషనర్ మనోజ్రెడ్డి స్థానంలో KMC కమిషనర్ రాకేశ్ చంద్రం, ప్రొద్దుటూరు RTO మనీషా స్థానంలో MVI నారాయణ నాయక్, జమ్మలమడుగు RDO శిరీషా స్థానంలో పులివెందుల RDO చిన్నయ్య, కడప RDO జాన్ స్థానంలో రాజంపేట సబ్ కలెక్టర్ భావనకు అదనపు బాధ్యతలు(FAC) అప్పగించారు.
News March 1, 2026
పాలమూరు: అంతరాలు లేని రేపటి కోసం..!

కుమ్మెర ఘటనలో 2 నెలల పసికందు మృతి సామాజిక వివక్ష ఎంతటి విషాదాన్ని మిగిల్చగలదో కళ్లకు కట్టింది. నేడు ‘Zero Discrimination Day’ సందర్భాన కులమతాల కంచెలు చెరిపేసి మనుషులమంతా ఒక్కటేనని చాటాల్సిన బాధ్యత మనపై ఉంది. పాప ప్రాణం బలి తీసుకున్న ఆ చేదు జ్ఞాపకం.. సమాజంలో ఇంకా వేళ్లూనుకున్న వివక్షకు నిదర్శనం. చట్టాలు ఎన్ని ఉన్నా, తోటి మనిషిని గౌరవించే ‘మానవత్వం’ అనే సంస్కారం అలవడినప్పుడే ఇలాంటి ఘోరాలు ఆగుతాయి.


