News February 27, 2026

ఉగాదికి లక్ష టిడ్కో ఇళ్ల పంపిణీ!

image

AP: ఉగాది(MAR 19) నాటికి లక్ష టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేయనున్నట్లు పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ తెలిపారు. మిగతా గృహాల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసుకొనేందుకు లబ్ధిదారులకు రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లను కోరారు. దీంతో 40,500 మందికి ₹1,345Cr ఇచ్చేందుకు సమ్మతించారు. కాగా ఈ ఏడాది జూన్‌ నాటికి మొత్తంగా 2.61 లక్షల ఇళ్లను పేదలకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.

Similar News

News March 4, 2026

దేశంలో 12% పెరిగిన ఉద్యోగ నియామకాలు

image

దేశంలో వైట్ కాలర్ జాబ్స్‌ నియామకాలు గత ఫిబ్రవరితో పోలిస్తే 12% పెరిగినట్లు నౌక్రీ సంస్థ రిపోర్ట్ వెల్లడించింది. ఏఐని అందిపుచ్చుకోవడం, ఐటీ రంగం కోలుకోవడమే ఇందుకు కారణాలుగా పేర్కొంది. ఐటీ రంగంలో నియామకాలు 6% పెరగగా.. ఇందులో ఫ్రెషర్స్ హైరింగ్ 8% పెరిగినట్లు తెలిపింది. నాన్ ఐటీ రంగాల నియామకాల్లో ఇన్సూరెన్స్‌లో 28%, BPO 22%, రియల్ఎస్టేట్ 19%, హాస్పిటాలిటీలో 15%, రిటైల్ 14% గ్రోత్ నమోదైంది.

News March 4, 2026

ఎండలు బాబోయ్..! ఏప్రిల్, మేలో హీట్ వేవ్స్

image

దేశంలో ఈసారి ఎండల ప్రభావం తీవ్రంగా ఉంటుందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. మార్చి నుంచి మే వరకు సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ఏప్రిల్, మేలో దక్షిణ, మధ్య భారతంలో హీట్ వేవ్స్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందని వెల్లడించింది. తీవ్ర ఉక్కపోతతో ఇబ్బందులు తప్పవని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అటు TGలో వచ్చే రెండు,మూడు రోజుల్లో టెంపరేచర్ 40డిగ్రీలను తాకుతుందని అంచనా వేసింది.

News March 4, 2026

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

image

TG: రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. ఇప్పటికే 16 మంది లిస్ట్‌ను టీపీసీసీ హైకమాండ్‌కు పంపింది. దీనిపై ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ తదితరులతో చర్చించనున్నారు. ఆపై ఏఐసీసీ పేర్లను ఖరారు చేయనుంది. రెండు సీట్లలో ఒక స్థానానికి ప్రస్తుత ఎంపీ అభిషేక్ సింఘ్వీని కొనసాగించే అవకాశం ఉన్నట్లు సమాచారం.