News February 27, 2026

జమ్మికుంట మార్కెట్‌లో స్థిరంగా పత్తి ధరలు..!

image

జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధరలు ఈ వారం ఒడిదుడుకుల మధ్య కొనసాగాయి. గత కొన్ని రోజులుగా పత్తి క్వింటాల్ ధర గరిష్టంగా రూ.7,550 నుండి రూ.7,600 మధ్యనే ఊగిసిలాడింది. శుక్రవారం మార్కెట్‌కు 28 వాహనాల్లో 226 క్వింటాళ్ల విడి పత్తి రాగా గరిష్టంగా రూ.7,550 పలికింది. పత్తి నాణ్యత బాగున్నప్పటికీ మార్కెట్‌లో డిమాండ్ సాధారణంగా ఉండటమే దీనికి ప్రధాన కారణమని వ్యాపార వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Similar News

News March 1, 2026

బాధ్యతలు స్వీకరించిన తిరుపతి జిల్లా అదనపు ఎస్పీ

image

తిరుపతి జిల్లా క్రైమ్ విభాగం అదనపు ఎస్పీగా ఆర్ల శ్రీనివాసులు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఎస్పీ సుబ్బరాయుడును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. చోరీలు, సైబర్ నేరాలు, పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ సూచించారు. ప్రజల భద్రతకు కట్టుబడి సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తానని ఆర్ల శ్రీనివాసులు తెలిపారు.

News March 1, 2026

INDvsWI.. ఒకే ఓవర్లో 24 రన్స్

image

వెస్టిండీస్‌తో మ్యాచులో భారత పేసర్ అర్ష్‌దీప్ ఒకే ఓవర్లో 24 పరుగులు సమర్పించుకున్నారు. ఆయన వేసిన 16వ ఓవర్లో వరుసగా 1, 0, 1, 5WD, 6, WD, 6, 4 వచ్చాయి. విండీస్ బ్యాటర్ పావెల్ చివరి 3 బంతుల్లో వరుసగా 6, 6, 4 బాదారు.

News March 1, 2026

నెల్లూరు GGH ఘటనపై స్పందించిన కలెక్టర్, ఎస్పీ

image

నెల్లూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (GGH)లో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై కలెక్టర్ హిమాన్షు శుక్లా. ఎస్పీ తక్షణమే స్పందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు పరిస్థితిని సమీక్షించారు. రోగులు, వారి కుటుంబ సభ్యులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఆసుపత్రిలోని రోగులందరూ సురక్షితంగా ఉన్నారని, ఎవరికి ఎటువంటి ప్రమాదం వాటిల్లలేదని కలెక్టర్ తెలిపారు.