News February 27, 2026
ప్రజల ముంగిటకే పాలన: బాపట్ల కలెక్టర్

అధికారులు విధులకు పరిమితం కాకుండా నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలని బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లో దివ్యాంగులు, ఎస్టీల ప్రత్యేక పీజీఆర్ఎస్ నిర్వహించి ఆయన పాల్గొన్నారు. బాపట్ల సేవా సేతుతో ప్రజల వద్దకే పాలన తెస్తున్నామన్నారు. తాగునీటి ఎద్దడిపై యాక్షన్ ప్లాన్, వృద్ధుల హక్కుల కరపత్రాలు విడుదల చేశారు. బాధితుల వినతులు స్వీకరించి అక్కడికక్కడే పరిష్కరించారు.
Similar News
News March 2, 2026
స్పేస్ రేస్ మళ్లీ మొదలైంది.. ఎందుకు? – 1/2

ఒకప్పుడు US, సోవియట్ యూనియన్లు అంతరిక్షంలో పైచేయి కోసం పోటాపోటీగా ప్రాజెక్టులు చేపట్టాయి. మూన్ ల్యాండింగ్పై నాసాకు పోటీగా చైనా కూడా ప్రాజెక్ట్ స్పీడప్ చేసినట్లు ప్రకటించడంతో మరోసారి ఇది తెరమీదకు వచ్చింది. 2028 నాటికి చంద్రుడిపైకి మనుషులను పంపాలని నాసా ప్లాన్ చేయగా.. చైనా ఈ టార్గెట్ 2030కి పెట్టుకుంది. మరోవైపు భారత్ సైతం 2040 నాటికి వ్యోమగాములను చంద్రుడిపైకి దింపాలని అనుకుంటోంది.
News March 2, 2026
స్పేస్ రేస్ మళ్లీ మొదలైంది.. ఎందుకు? – 2/2

మూన్ ల్యాండింగ్తో పాటు వివిధ స్పేస్ ప్రాజెక్టులపైనా భారత్ ఫోకస్ పెంచింది. ఇదంతా ఒకప్పుడు ప్రతిష్ఠ కోసమైతే ఇప్పుడు అది అవసరం. అంతరిక్షంపై పట్టు ఉంటేనే భవిష్యత్తులో భౌగోళిక రాజకీయాలను శాసించగలమని, రక్షణ వ్యవస్థను పటిష్ఠం చేసుకోగలమని ప్రపంచ దేశాలు విశ్వసిస్తున్నాయి. అంతేకాదు స్పేస్లో మరింత లోతుగా అన్వేషించేందుకు చంద్రుడిని వ్యోమనౌకల రీఫ్యూల్లింగ్ స్టేషన్గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాయి.
News March 2, 2026
మెండోరా: హాస్టల్లో విద్యార్థినిపై లైంగిక వేధింపులు.. వ్యక్తి అరెస్టు

మెండోరా మండలం పోచంపాడ్లోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో ఎలక్ట్రీషియన్గా పని చేస్తున్న వ్యక్తి కొన్ని రోజుల కిందట ఓ విద్యార్థినిని లైంగికంగా వేధించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వేధించిన వ్యక్తి జక్రాన్పల్లి మండలానికి చెందిన నెహ్రూగా గుర్తించి అతన్ని అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు మెండోర SI సుహాసిని తెలిపారు.


